Telugu Global
National

నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు.... నాపై భారీ కుట్ర జరుగుతోంది!

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై భారీ కుట్ర జరుగుతోందన్నారు. నాయకులు ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహించాలని…. తను చేసిన వ్యాఖ్యలను ప్రత్యర్థులు, మీడియా వక్రీకరిస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ అధిష్టానానికి, తనకు మధ్య చిచ్చు పెట్టేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కొందరు ప్రతిపక్ష నేతలు, ఓ వర్గం మీడియా తన మాటలను వారికి అనుకూలంగా మార్చుకుంటున్నాయని చెప్పుకొచ్చారు. బీజేపీని, తనను అప్రతిష్టపాలు చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వారి కుట్రలు ఇక […]

నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు.... నాపై భారీ కుట్ర జరుగుతోంది!
X

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై భారీ కుట్ర జరుగుతోందన్నారు. నాయకులు ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహించాలని…. తను చేసిన వ్యాఖ్యలను ప్రత్యర్థులు, మీడియా వక్రీకరిస్తున్నాయని మండిపడ్డారు.

బీజేపీ అధిష్టానానికి, తనకు మధ్య చిచ్చు పెట్టేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కొందరు ప్రతిపక్ష నేతలు, ఓ వర్గం మీడియా తన మాటలను వారికి అనుకూలంగా మార్చుకుంటున్నాయని చెప్పుకొచ్చారు.

బీజేపీని, తనను అప్రతిష్టపాలు చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వారి కుట్రలు ఇక సాగవని గడ్కరీ స్పష్టం చేశారు.

మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ…. ప్రజా జీవితంలో ఓటమిని, వైఫల్యాలను నాయకులు అంగీకరించాలని వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ అధికారంలో ఉన్న రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కొన్ని రోజులకే గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ అధినాయకత్వాన్ని ఉద్దేశించే గడ్కరీ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

First Published:  23 Dec 2018 9:16 PM GMT
Next Story