Telugu Global
NEWS

టీమిండియా టీ-20 జట్టులో మళ్లీ ధోనీ

న్యూజిలాండ్ తో సిరీస్ కు జార్ఖండ్ డైనమైట్ 2019 ఫిబ్రవరి నుంచి న్యూజిలాండ్ తో టీ-20 సిరీస్ మాజీ కెప్టెన్, ఆల్ టైమ్ గ్రేట్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోనీ…తిరిగి టీమిండియా టీ-20 జట్టులో చోటు సంపాదించాడు. 2019 ఫిబ్రవరిలో న్యూజిలాండ్ తో జరిగే టీ-20 సిరీస్ లో పాల్గొనే భారతజట్టు సభ్యుల వివరాలను బీసీసీఐ ఎంపిక సంఘం ప్రకటించింది. యువఆటగాడు రిషభ్ పంత్ కు తగిన అవకాశాలు కల్పించడం కోసం…గత రెండు సిరీస్ […]

టీమిండియా టీ-20 జట్టులో మళ్లీ ధోనీ
X
  • న్యూజిలాండ్ తో సిరీస్ కు జార్ఖండ్ డైనమైట్
  • 2019 ఫిబ్రవరి నుంచి న్యూజిలాండ్ తో టీ-20 సిరీస్

మాజీ కెప్టెన్, ఆల్ టైమ్ గ్రేట్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోనీ…తిరిగి టీమిండియా టీ-20 జట్టులో చోటు సంపాదించాడు. 2019 ఫిబ్రవరిలో న్యూజిలాండ్ తో జరిగే టీ-20 సిరీస్ లో పాల్గొనే భారతజట్టు సభ్యుల వివరాలను బీసీసీఐ ఎంపిక సంఘం ప్రకటించింది.

యువఆటగాడు రిషభ్ పంత్ కు తగిన అవకాశాలు కల్పించడం కోసం…గత రెండు సిరీస్ లుగా జట్టుకు దూరంగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీని తిరిగి జట్టులోకి తీసుకోవాలని సెలెక్షన్ కమిటీ నిర్ణయించింది.

విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా టీ-20 జట్టు సభ్యుల్లో…రోహిత్ శర్మ, రాహుల్, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, మహేంద్ర సింగ్ ధోనీ, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, హార్ధిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్ ఉన్నారు.

First Published:  25 Dec 2018 3:14 AM GMT
Next Story