Telugu Global
Cinema & Entertainment

త్రివిక్రమ్ పోయాడు.... మళ్ళీ పరశురాం వచ్చాడు

“యువత” “సోలో” “ఆంజనేయులు” “శ్రీ రస్తు శుభమస్తు” సినిమాలతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ పరశురాం. ఈ సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఏడాది వ‌చ్చిన “గీత‌గోవిందం” మ‌రో ఎత్తు. విజ‌య్ దేవ‌రకొండ హీరోగా వ‌చ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి దాదాపు 100 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. మామూలు డైరెక్టర్ గా ఉండే పరశురాంని స్టార్ డైరెక్ట‌ర్ గా మార్చేసింది ఈ సినిమా. ఇప్పుడు […]

త్రివిక్రమ్ పోయాడు.... మళ్ళీ పరశురాం వచ్చాడు
X

“యువత” “సోలో” “ఆంజనేయులు” “శ్రీ రస్తు శుభమస్తు” సినిమాలతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ పరశురాం. ఈ సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఏడాది వ‌చ్చిన “గీత‌గోవిందం” మ‌రో ఎత్తు.

విజ‌య్ దేవ‌రకొండ హీరోగా వ‌చ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి దాదాపు 100 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. మామూలు డైరెక్టర్ గా ఉండే పరశురాంని స్టార్ డైరెక్ట‌ర్ గా మార్చేసింది ఈ సినిమా.

ఇప్పుడు ఈ దర్శకుడు అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేసే లక్కీ ఛాన్స్ ని అందుకున్నాడు. “నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా” ఫ్లాప్ తరువాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేయాలి. కానీ త్రివిక్రమ్ ఇంకా కథతో రెడీ గా లేకపోవడం అలాగే త్రివిక్రమ్ గీత ఆర్ట్స్ లో సినిమా చెయ్యను అనడంతో ఈ సినిమా ఆగిపోయింది.

ఇక ఇప్పుడు చేసేది లేక పరశురాం కథకి ఓకే చెప్పాడట అల్లు అర్జున్. ఇప్పుడు గీతా ఆర్ట్స్ లోనే వ‌ర‌స‌గా మూడో సినిమా చేయ‌బోతున్నాడు ప‌రశురామ్. ఈ బ్యాన‌ర్ లో వ‌ర‌స‌గా మూడు సినిమాలు చేస్తున్న తొలి ద‌ర్శ‌కుడు ప‌రశురామే కావడం విశేషం.

First Published:  25 Dec 2018 4:00 AM GMT
Next Story