Telugu Global
NEWS

జగన్‌ తిక్క నా కొడుకు... టికెట్‌కు 10 కోట్లు అడుగుతాడా?- జేసీ

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ”జగన్ మావాడు” అంటూనే కడిగిపారేశారు. జగన్‌ కులాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారని విమర్శించారు. అనంతపురం జిల్లాలో జరిగిన ధర్మపోరాట దీక్షలో మాట్లాడిన జేసీ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ”రాష్ట్రానికి కుల పిచ్చిపట్టింది సర్‌ (సర్ అంటే చంద్రబాబు). ఒకడు బలిజ అంటాడు… మరొకడు రెడ్డి అంటున్నాడు.. మావాడు జగన్ తిక్కనా కొడుకు సర్… నా ఫ్రెండ్‌ సన్‌ కాబట్టి నాకు ఇంకా […]

జగన్‌ తిక్క నా కొడుకు... టికెట్‌కు 10 కోట్లు అడుగుతాడా?- జేసీ
X

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ”జగన్ మావాడు” అంటూనే కడిగిపారేశారు. జగన్‌ కులాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారని విమర్శించారు. అనంతపురం జిల్లాలో జరిగిన ధర్మపోరాట దీక్షలో మాట్లాడిన జేసీ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

”రాష్ట్రానికి కుల పిచ్చిపట్టింది సర్‌ (సర్ అంటే చంద్రబాబు). ఒకడు బలిజ అంటాడు… మరొకడు రెడ్డి అంటున్నాడు.. మావాడు జగన్ తిక్కనా కొడుకు సర్… నా ఫ్రెండ్‌ సన్‌ కాబట్టి నాకు ఇంకా కొంచెం ప్రేమ ఉంది వాడి మీద. వాడు కులం పేరుతో గెలవాలనుకుంటున్నాడు. సర్‌ మేం ఎంత మంది ఉన్నాం సర్ రెడ్లం?. ఆరేడు శాతం ఉంటే గొప్ప. మీరు మా కంటే ఇంకా ఒక శాతం తక్కువే ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ది ఏ కులం, చంద్రబాబుది ఏకులం అని అడిగినవాడు లేడు. ఇప్పుడు మాత్రం ప్రతోడు మీ కులం ఏంది అని అడుగుతున్నారు” అని జేసీ మండిపడ్డారు.

”జగన్‌కు బుద్దిలేదు పాడు లేదు. వాడికి కాళ్ల కింద చూపే తప్ప ముందు చూపు లేదు. అలాంటి ముందు చూపు ఉంటే ఎప్పుడో ముఖ్యమంత్రి అయి ఉండేవాడు. వాడికి ఆ యోగం లేదు కాబట్టి సీఎం కాలేకపోయాడు” అని వ్యాఖ్యానించారు. హిందూపురం టికెట్‌ ఇచ్చేందుకు నవీన్ నిశ్చల్‌ను పది కోట్లు డిమాండ్ చేసిన వ్యక్తి జగన్‌ అని… దాంతో నిశ్చల్ బోరున ఏడుస్తున్నారని జేసీ చెప్పారు. చంద్రబాబును మళ్లీ గెలిపిస్తే ప్రజలు ప్రశాంతంగా ఉంటారని… అదే జగన్‌కు ఓటేస్తే అందరూ ఊర్లు విడిచి బెంగళూరు వెళ్లాల్సి ఉంటుందన్నారు.

First Published:  26 Dec 2018 5:58 AM GMT
Next Story