Telugu Global
National

మోడీ.... ఏపీకి రావడం లేదు, ప్రోగ్రామ్ క్యాన్సిల్!

ఒకవైపు వచ్చే ఏడాది జనవరి మొదటివారంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏపీకి వస్తున్నాడని చాన్నాళ్ల కిందటే ప్రకటించారు. గుంటూరులో మోడీ అధ్యక్షతన భారీ సభను నిర్వహించడానికి బీజేపీ అన్ని ఏర్పాట్లూ చేసుకుంది. ఇక బీజేపీ మోడీ సభ కోసం రెడీ కావడమే కాదు.. మోడీ ఏపీకి రావడం విషయంలో వాదోపవాదాలు కూడాసాగుతున్నాయి. ఏపీకి మోడీ అన్యాయం చేశాడని ఆయన ఏపీకి రావడానికి వీల్లేదని తెలుగుదేశం అంటోంది. మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీ మోడీ భజన చేసింది. మోడీ అంటే తోపు […]

మోడీ.... ఏపీకి రావడం లేదు, ప్రోగ్రామ్ క్యాన్సిల్!
X

ఒకవైపు వచ్చే ఏడాది జనవరి మొదటివారంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏపీకి వస్తున్నాడని చాన్నాళ్ల కిందటే ప్రకటించారు. గుంటూరులో మోడీ అధ్యక్షతన భారీ సభను నిర్వహించడానికి బీజేపీ అన్ని ఏర్పాట్లూ చేసుకుంది. ఇక బీజేపీ మోడీ సభ కోసం రెడీ కావడమే కాదు.. మోడీ ఏపీకి రావడం విషయంలో వాదోపవాదాలు కూడాసాగుతున్నాయి. ఏపీకి మోడీ అన్యాయం చేశాడని ఆయన ఏపీకి రావడానికి వీల్లేదని తెలుగుదేశం అంటోంది.

మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీ మోడీ భజన చేసింది. మోడీ అంటే తోపు అని, తురుము అని తెలుగుదేశం పార్టీ చెప్పుకొచ్చింది. మోడీనే మళ్లీ ప్రధాని కావాలంటూ ఆ మధ్య తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తీర్మానం కూడా పెట్టాడు.

అయితే ఇప్పుడు మోడీ అంటే తెలుగుదేశానికి పడటం లేదు. మోడీ మీద యుద్ధం అంటోంది తెలుగుదేశం. ఇలాంటి పరిస్థితుల మధ్యన మోడీ ఏపీకి వస్తున్నాడంటే తెలుగుదేశం పార్టీ తట్టుకోలేకపోయింది. ఈ విషయంలో మోడీని, బీజేపీని విమర్శిస్తూ తెలుగుదేశంపార్టీ విరుచుకుపడుతోంది.

అయితే మోడీ ఏపీకి వచ్చి తమ వాదనను వినినిపించేలా ఉన్నాడు. దీంతో సామాన్యుల్లో కూడా మోడీ ఏపీ పర్యటన ఆసక్తిని రేపింది. అయితే ఇప్పుడు అది అనూహ్యంగా రద్దు అయ్యింది.

ఈ కార్యక్రమాన్ని జనవరిలో నిర్వహించడం లేదని.. ఫిబ్రవరిలో నిర్వహిస్తామన్నట్టుగా కమలం పార్టీ చెబుతోంది. అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమం రద్దు అయిందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

First Published:  28 Dec 2018 5:50 AM GMT
Next Story