Telugu Global
NEWS

తాడిపత్రిలో ఉద్రిక్తత... పోలీస్ జీపును తగలబెట్టారు... సీఐ తల పగలగొట్టారు...

తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసుల పైనే దాడికి తెగబడ్డారు. దాడిలో సీఐ హమీద్‌ ఖాన్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. పోలీసులను ఆస్పత్రికి తరలించారు. పోలీసు జీపును నడిరోడ్డు పైనే తగలబెట్టారు. ఫైరింజన్ వచ్చి మంటలను ఆర్పివేసింది. ప్రభాకర్‌ రెడ్డి అనుచరులు మట్కా నిర్వహిస్తుండడంతో పక్కా సమాచారంతో కడప జిల్లాకు చెందిన  సీఐ బృందం దాడి చేసింది. ప్రభాకర్‌ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న […]

తాడిపత్రిలో ఉద్రిక్తత... పోలీస్ జీపును తగలబెట్టారు... సీఐ తల పగలగొట్టారు...
X

తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసుల పైనే దాడికి తెగబడ్డారు. దాడిలో సీఐ హమీద్‌ ఖాన్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు.

పోలీసులను ఆస్పత్రికి తరలించారు. పోలీసు జీపును నడిరోడ్డు పైనే తగలబెట్టారు. ఫైరింజన్ వచ్చి మంటలను ఆర్పివేసింది.

ప్రభాకర్‌ రెడ్డి అనుచరులు మట్కా నిర్వహిస్తుండడంతో పక్కా సమాచారంతో కడప జిల్లాకు చెందిన సీఐ బృందం దాడి చేసింది. ప్రభాకర్‌ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న రషీద్‌ ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు పోలీసులు వచ్చారు.

మట్కా నిర్వహిస్తున్నట్టు నిర్ధారించుకున్న పోలీసులు… రషీద్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో రషీద్, అతడి అనుచరులు తిరగబడ్డారు. పోలీసులపై దాడికి తెగబడ్డారు.

రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. దాడి తర్వాత రషీద్‌ గ్యాంగ్‌ పారిపోయింది. దాడి చేసిన రషీద్‌ టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డికి ప్రధాన అనుచరుడు కావడంతో తదుపరి చర్యలపై పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు.

First Published:  30 Dec 2018 8:00 AM GMT
Next Story