Telugu Global
Cinema & Entertainment

నాగార్జున, ధనుష్ సినిమా ఆగిపోయింది?

అక్కినేని నాగార్జున ఈ ఏడాది “ఆఫీసర్” సినిమాతో ఒక ప్లాప్ ని…. అలాగే “దేవదాస్” సినిమాతో యావరేజ్ హిట్ ని అందుకున్నాడు. ఇక వచ్చే ఏడాది మాత్రం నాగార్జున బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు. “బ్రహ్మాస్త్ర” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున తో పాటు రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ పై కరణ్ జోహార్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇక మలయాళంలో మోహన్ లాల్ […]

నాగార్జున, ధనుష్ సినిమా ఆగిపోయింది?
X

అక్కినేని నాగార్జున ఈ ఏడాది “ఆఫీసర్” సినిమాతో ఒక ప్లాప్ ని…. అలాగే “దేవదాస్” సినిమాతో యావరేజ్ హిట్ ని అందుకున్నాడు. ఇక వచ్చే ఏడాది మాత్రం నాగార్జున బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు.

“బ్రహ్మాస్త్ర” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున తో పాటు రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ పై కరణ్ జోహార్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

ఇక మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న ‘మరాక్కార్’ సినిమాలో ఓ కీలక పాత్ర చేయడానికి అంగీకరించాడు నాగార్జున. వీటితో పాటు తమిళంలో ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘రుద్ర’ అనే మల్టీస్టారర్ మూవీకి నాగ్ సంతకం చేసిన సంగతి అందరికి తెలిసిందే.

నిజానికి రజనీకాంత్ చేయాల్సిన పాత్ర అది. రజనీకాంత్ డేట్స్ అందుబాటులో లేకపోవడంతో…. నాగార్జున ని ఆ పాత్ర కోసం తీసుకున్నాడట ధనుష్. ఎస్ జే సూర్య…. అదితిరావు హైదరి…. అరవింద్ స్వామి లాంటి ఇంట్రెస్టింగ్ కాస్టింగ్ తో ఈ చిత్రం రాబోతుంది అనే న్యూస్ కూడా వచ్చింది. రూ.70 కోట్ల బడ్జెట్ లో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు కూడా చెప్పాడు ధనుష్.

అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆగిపోయిందని కోలీవుడ్ మీడియా అంటోంది. తన లేటెస్ట్ మూవీ ‘మారి-2’ విడుదలయ్యాక ధనుష్ ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తాడని అన్నారు. కానీ ఇప్పుడు ధనుష్ తాను హీరోగా ‘అసురన్’ అనే సినిమా అనౌన్స్ చేశాడు.

అలాగే నిర్మాతలతో ఇబ్బంది ఉండటం వల్లే ధనుష్ ఈ మల్టీస్టారర్ సినిమాని ఆపేసాడనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది అనుకున్న ఈ సినిమా మధ్యలో ఆగిపోయిందని అంటున్నారు.

First Published:  29 Dec 2018 7:20 PM GMT
Next Story