Telugu Global
NEWS

రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.... షాక్‌లో అనుచరులు

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మౌనంగా ఉంటున్నారు. మీడియా వేదికగా ప్రత్యర్థులపై విరుకుపడే రేవంత్ రెడ్డి…. ఎన్నికల తర్వాత నోరు విప్పడం లేదు. మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఈ వాతావరణం నుంచి బయటపడేందుకు ఇటీవల విహారయాత్రలు చేస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆయన అభిమానులతో పాటు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమైంది. తాను మరో రెండేళ్ల వరకు మీడియాతో మాట్లాడబోనని రేవంత్ రెడ్డి సన్నిహితుల వద్ద స్పష్టం చేశారు. […]

రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం....  షాక్‌లో అనుచరులు
X

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మౌనంగా ఉంటున్నారు. మీడియా వేదికగా ప్రత్యర్థులపై విరుకుపడే రేవంత్ రెడ్డి…. ఎన్నికల తర్వాత నోరు విప్పడం లేదు. మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఈ వాతావరణం నుంచి బయటపడేందుకు ఇటీవల విహారయాత్రలు చేస్తున్నారు.

తాజాగా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆయన అభిమానులతో పాటు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమైంది. తాను మరో రెండేళ్ల వరకు మీడియాతో మాట్లాడబోనని రేవంత్ రెడ్డి సన్నిహితుల వద్ద స్పష్టం చేశారు. ఇన్నాళ్లు మీ కోసం మాట్లాడా… ఇప్పుడు నాకోసం మీడియాతో మాట్లాడడం మానేస్తున్నా అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీడియాలొ తన దూకుడు మరీ ఎక్కువైపోవడం కూడా ఓటమికి ఒక కారణంగా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

అందుకే ఆయన మీడియాకు కొద్దికాలం పాటు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల ఆయన అనుచరులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓడిపోయినంత మాత్రాన ఏకంగా సుధీర్ఘ కాలం మౌనంగా ఉంటానని చెప్పడం సరికాదంటున్నారు.

రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని కాంగ్రెస్ నాయకత్వం కూడా సమర్ధించే పరిస్థితులు కనిపించడం లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్ రెడ్డే మౌనంగా ఉంటే కేడర్‌లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఓటమి వల్ల ఆవేదనతో ఉన్న రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని.. కొద్ది రోజుల్లోనే ఆయన తిరిగి గతంలో లాగే దూకుడు ప్రదర్శిస్తారని కొందరు అనుచరులు చెబుతున్నారు. చూడాలి … మీడియా ముందుకు రాకుండా రేవంత్ రెడ్డి ఎన్నాళ్లు మౌనంగా ఉంటారో!.

First Published:  31 Dec 2018 8:37 AM GMT
Next Story