Telugu Global
NEWS

పులుల ఫారెస్ట్‌ వెంబడి తిరుగుతున్న రేవంత్ రెడ్డి

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు. రాజకీయాలకు దూరంగా విహారయాత్రలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికలు ముగిసి నెల కూడా కాకపోవడంతో రాజకీయాలకు విరామం ఇచ్చారు. కొద్ది రోజులుగా స్థానికంగా రేవంత్ రెడ్డి కనిపించడం లేదు. ఆయన ఇప్పుడు దర్శనీయ ప్రదేశాల్లో పర్యటనలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని పెంచ్‌ టైగర్‌ ఫారెస్ట్‌లో రేవంత్ రెడ్డి తిరుగుతున్నారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి. పదునైన మాటలతో ప్రత్యర్థులపై […]

పులుల ఫారెస్ట్‌ వెంబడి తిరుగుతున్న రేవంత్ రెడ్డి
X

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు. రాజకీయాలకు దూరంగా విహారయాత్రలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పర్యటనలు చేస్తున్నారు.

ఎన్నికలు ముగిసి నెల కూడా కాకపోవడంతో రాజకీయాలకు విరామం ఇచ్చారు. కొద్ది రోజులుగా స్థానికంగా రేవంత్ రెడ్డి కనిపించడం లేదు. ఆయన ఇప్పుడు దర్శనీయ ప్రదేశాల్లో పర్యటనలు చేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లోని పెంచ్‌ టైగర్‌ ఫారెస్ట్‌లో రేవంత్ రెడ్డి తిరుగుతున్నారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి. పదునైన మాటలతో ప్రత్యర్థులపై విరుచుకుపడే రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయి…. ఇలా యాత్రలు చేస్తుండడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమకు తోచినట్లు స్పందిస్తున్నారు.

First Published:  31 Dec 2018 2:25 AM GMT
Next Story