Telugu Global
Cinema & Entertainment

రీఎంట్రీపై స్పందించిన తెలుగు హీరోయిన్

మామూలుగానే సినిమాలు తక్కువ. పెళ్లయిన తర్వాత పూర్తిగా మానేసింది. ఇప్పుడు రీఎంట్రీపై రియాక్ట్ అయింది హీరోయిన్ స్వాతి. ఇంటర్నేషనల్ పైలెట్ వికాస్ ను పెళ్లాడిన తర్వాత ఇండోనేషియాలో సెటిలైన ఈ ముద్దుగుమ్మ రీఎంట్రీ ఇస్తానంటోంది. “కచ్చితంగా రీఎంట్రీ ఇస్తా. కానీ అది ఎప్పుడనేది అప్పుడే చెప్పలేను. ఎందుకంటే ఇంకా నేను ఫ్యామిలీ లైఫ్ ను పూర్తిగా ఎంజాయ్ చేయలేదు. కానీ రీంట్రీ మాత్రం పక్కా. మా ఆయన కూడా మళ్లీ ఎప్పుడు సినిమాలు చేస్తావ్ అని అడుగుతున్నాడు.” […]

రీఎంట్రీపై స్పందించిన తెలుగు హీరోయిన్
X
మామూలుగానే సినిమాలు తక్కువ. పెళ్లయిన తర్వాత పూర్తిగా మానేసింది. ఇప్పుడు రీఎంట్రీపై రియాక్ట్ అయింది హీరోయిన్ స్వాతి. ఇంటర్నేషనల్ పైలెట్ వికాస్ ను పెళ్లాడిన తర్వాత ఇండోనేషియాలో సెటిలైన ఈ ముద్దుగుమ్మ రీఎంట్రీ ఇస్తానంటోంది.
“కచ్చితంగా రీఎంట్రీ ఇస్తా. కానీ అది ఎప్పుడనేది అప్పుడే చెప్పలేను. ఎందుకంటే ఇంకా నేను ఫ్యామిలీ లైఫ్ ను పూర్తిగా ఎంజాయ్ చేయలేదు. కానీ రీంట్రీ మాత్రం పక్కా. మా ఆయన కూడా మళ్లీ ఎప్పుడు సినిమాలు చేస్తావ్ అని అడుగుతున్నాడు.”
ఇలా రీఎంట్రీపై స్పందించింది స్వాతి. ప్రస్తుతం తెలుగులో చాలామంది దర్శకులు మంచి సినిమాలు చేస్తున్నారని, వాళ్లందరితో సినిమాలు చేయాలని ఉందంటోంది స్వాతి. ఇండోనేషియాకు రాకముందే సినిమాలు చూడడం తగ్గించేశానని తెలిపిన ఈ తెలుగమ్మాయి.. బన్నీ నటించిన డీజే సినిమాను తను చూసిన ఆఖరి చిత్రంగా పేర్కొంది. ప్రస్తుతం ఇంటి పనులతో బిజీగా ఉన్నానని, త్వరలోనే మరిన్ని సినిమాలు చూస్తానని చెబుతోంది.
First Published:  2 Jan 2019 4:42 AM GMT
Next Story