ఫినిష్ అయిపోతావ్... మహిళకు బాబు వార్నింగ్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కోపం వచ్చింది. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు కాకినాడ వచ్చిన సీఎంను కొందరు బీజేపీ కార్యకర్తలు ఘెరావ్ చేశారు. సీఎం కాన్వాయ్ని కొందరు మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు సహనం కోల్పోయారు. ఒక బీజేపీ మహిళా నేతను తీవ్రంగా హెచ్చరించారు. మాతో పెట్టుకుంటే ఫినిష్ అయిపోతారు… మిమ్మల్ని వదిలిపెట్టం… మర్యాదగా ఉండు… లేకుంటే చాలా సమస్యలు వస్తాయి, లేనిపోని ప్రాబమ్స్ తెచ్చుకోవద్దు అంటూ మహిళను ముఖ్యమంత్రి హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఒక మహిళను అలా […]
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కోపం వచ్చింది. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు కాకినాడ వచ్చిన సీఎంను కొందరు బీజేపీ కార్యకర్తలు ఘెరావ్ చేశారు. సీఎం కాన్వాయ్ని కొందరు మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు సహనం కోల్పోయారు.
ఒక బీజేపీ మహిళా నేతను తీవ్రంగా హెచ్చరించారు. మాతో పెట్టుకుంటే ఫినిష్ అయిపోతారు… మిమ్మల్ని వదిలిపెట్టం… మర్యాదగా ఉండు… లేకుంటే చాలా సమస్యలు వస్తాయి, లేనిపోని ప్రాబమ్స్ తెచ్చుకోవద్దు అంటూ మహిళను ముఖ్యమంత్రి హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఒక మహిళను అలా హెచ్చరించడంతో అక్కడున్న వారంతా కంగుతిన్నారు.
ముఖ్యమంత్రి తీరును వైసీపీ మహిళా నేతలు తీవ్రంగా ఖండించారు. ఒక మహిళ పట్ల ముఖ్యమంత్రి వీధి రౌడీ తరహాలో ప్రవర్తించారని… ఇలా చేయడం ద్వారా సభ్యసమాజానికి చంద్రబాబు ఏం మేసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శైలజా చరణ్ ప్రశ్నించారు.
గతంలో కూడా ఆడ పిల్లల పుట్టుకనే హేళన చేస్తూ చంద్రబాబు మాట్లాడారని… సీఎం వైఖరి వల్లే ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని మండిపడ్డారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టుగా…. చంద్రబాబు వైఖరి చూసుకునే ఫించన్ అడిగిన వింతతు మహిళలను… మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ”దున్నల్లా ఉన్నారు మీకెందుకు పించన్ ఇవ్వాలి” అంటూ దూషించారని మండిపడ్డారు.
”భర్తలను రాచి రంపాన పెట్టి తరిమేసి ఇప్పుడు పించన్ ఇవ్వండి అని అడిగితే ఎందుకివ్వాలి” అని చింతకాయల వ్యాఖ్యానించడం బట్టే టీడీపీ నేతలకు మహిళలంటే ఎంత చులకన భావమో అర్థమవుతోందన్నారు. కారు షెడ్లో ఉండాలి.. ఆడది ఇంట్లో ఉండాలి అన్న ఘనత టీడీపీ నేత అయిన స్పీకర్ కోడెల శివప్రసాద్కు మాత్రమే దక్కుతుందని వైసీపీ నాయకురాలు శైలజా చరణ్ విమర్శించారు.