Telugu Global
Cinema & Entertainment

కథానాయకుడు.... నిజంగానే "సై రా" ను బ్రేక్ చేసిందా?

నందమూరి బాలక్రిష్ణ నటించిన “ఎన్టీఆర్” బయోపిక్ సినిమా జనవరి 9 న రిలీజ్ కి రెడీ అయిన సంగతి అందరికీ తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమా మొదటి భాగం “కథానాయకుడు” ఈ నెల 9 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ రేట్ కి అమ్ముడుపోయాయనే వార్తలొస్తున్నాయి. ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు గానీ…. ఒక ప్రముఖ ఛానల్ ఈ సినిమా డిజిటల్ […]

కథానాయకుడు.... నిజంగానే సై రా ను  బ్రేక్ చేసిందా?
X

నందమూరి బాలక్రిష్ణ నటించిన “ఎన్టీఆర్” బయోపిక్ సినిమా జనవరి 9 న రిలీజ్ కి రెడీ అయిన సంగతి అందరికీ తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమా మొదటి భాగం “కథానాయకుడు” ఈ నెల 9 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ రేట్ కి అమ్ముడుపోయాయనే వార్తలొస్తున్నాయి.

ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు గానీ…. ఒక ప్రముఖ ఛానల్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని 25 కోట్లకి కొన్నదట.

అయితే ఇదివరకు “సై రా” సినిమా రైట్స్ ను 20 కోట్లు పెట్టి కొన్నదట సదరు ఛానల్. కానీ “సై రా” కంటే ఎక్కువ రేట్ పెట్టి ఇప్పుడు “ఎన్టీఆర్” రైట్స్ ని కొన్నారట. ఇది కూడా కేవలం మొదటి భాగానికి మాత్రమేనట. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ని బాలక్రిష్ణ వారాహి చలన చిత్రం బ్యానర్ తో కలిసి నిర్మించాడు.

అయితే కథానాయకుడు నిజంగానే “సై రా” ను బ్రేక్ చేసిందా? అనేది మూవీ యూనిట్ మీడియా ముందుకు వచ్చి…. ఈ వార్తలను కన్ ఫార్మ్ చేస్తుందో లేదో చూడాలి.

First Published:  5 Jan 2019 9:01 PM GMT
Next Story