వైసీపీలో చేరిన ప్రముఖ నటుడు
వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. చిత్ర పరిశ్రమ నుంచి కూడా పలువురు వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పోసాని, పృధ్వీ, కృష్ణుడు లాంటి వారు వైసీపీలో చేరారు. మరికొందరు జగన్ను కలిసి సంఘీభావం తెలిపారు. ఇటీవలే వైఎస్ జగన్ను పాదయాత్రలో కలిసిన ప్రముఖ నటుడు భానుచందర్ కూడా ఇప్పుడు వైసీపీలో చేరారు. ఇచ్చాపురంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా వైసీపీలో చేరారు. భానుచందర్కు కండువా కప్పి జగన్ ఆహ్వానించారు. ప్రజల కోసం జగన్లా తపించే నాయకుడిని ఇప్పటి వరకు […]
వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. చిత్ర పరిశ్రమ నుంచి కూడా పలువురు వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పోసాని, పృధ్వీ, కృష్ణుడు లాంటి వారు వైసీపీలో చేరారు. మరికొందరు జగన్ను కలిసి సంఘీభావం తెలిపారు.
ఇటీవలే వైఎస్ జగన్ను పాదయాత్రలో కలిసిన ప్రముఖ నటుడు భానుచందర్ కూడా ఇప్పుడు వైసీపీలో చేరారు. ఇచ్చాపురంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా వైసీపీలో చేరారు. భానుచందర్కు కండువా కప్పి జగన్ ఆహ్వానించారు.
ప్రజల కోసం జగన్లా తపించే నాయకుడిని ఇప్పటి వరకు తాను చూడలేదని భానుచందర్ చెప్పారు. 2019 నుంచి మరో 20 ఏళ్ల పాటు జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.