Telugu Global
Cinema & Entertainment

పోస్ట్ పోన్  అయిన "మహర్షి" 

గత ఏడాది “భరత్ అనే నేను ” సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు తన 25వ సినిమాగా “మహర్షి” లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ని దిల్ రాజు, అశ్విని దత్ ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే దిల్ రాజు ఈ సినిమాని ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. కానీ ఇప్పుడున్న  తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా […]

పోస్ట్ పోన్  అయిన మహర్షి 
X

గత ఏడాది “భరత్ అనే నేను ” సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు తన 25వ సినిమాగా “మహర్షి” లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ని దిల్ రాజు, అశ్విని దత్ ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే దిల్ రాజు ఈ సినిమాని ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. కానీ ఇప్పుడున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల వాయిదా పడిందని తెలుస్తోంది.

ఇప్పటికే యువ హీరోలు నాగచైతన్య, సాయి ధరమ్ తేజ్ వాళ్ళు నటిస్తున్న సినిమాలను ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే నాని కూడా తన “జెర్సీ” సినిమాని ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించేశాడు. అయితే మహేష్ బాబు కంటే తక్కువ మార్కెట్ ఉన్న ఈ ముగ్గురు హీరోలు మహేష్ బాబు సినిమాకు పోటీగా ఏప్రిల్లోనే విడుదల చేయాలి అనుకోవడానికి కారణం మహేష్ సినిమా వాయిదా పడటమే అని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

ఆ సినిమా పోస్ట్ పోన్ అయినందుకే ఈ చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయట. పైగా దర్శకుడు వంశీ పైడిపల్లి ఒక సినిమా పూర్తి చేయడానికి చాలా కాలం తీసుకుంటాడు అనే విషయం తెలిసిందే.

ఇక మహేష్ బాబు తో సినిమా చేస్తున్నాడు కాబట్టి ఇంకా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు అని టాక్. ఇకపోతే అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా ఏప్రిల్ 26న రిలీజ్ అవుతుందని అంటున్నారు.

First Published:  15 Jan 2019 11:00 PM GMT
Next Story