Telugu Global
NEWS

కేసీఆర్‌కు 36 వంటలు పెట్టి, మూతి తుడిచినప్పుడు ఏమైంది?

కేటీఆర్‌, వైఎస్ జగన్‌ భేటీ పై టీడీపీ చేస్తున్న విమర్శలకు వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటుగా సమాధానం ఇచ్చారు. మొన్నటి వరకు చంద్రబాబు… కేసీఆర్‌ చుట్టూ ప్రదక్షణలు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు కేటీఆర్- జగన్ కలిస్తే మాత్రం కుట్ర ఎలా అవుతుందని ప్రశ్నించారు. కేటీఆర్‌, జగన్ కలిస్తే టీడీపీ నేతలు ఎందుకు ఇంతగా వణికిపోతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ గతంలో దేవినేని ఉమను ఆడనా?.. మగనా? అని ప్రశ్నించారని.. అలాంటి కేసీఆర్‌ విజయవాడకు వస్తే […]

కేసీఆర్‌కు 36 వంటలు పెట్టి, మూతి తుడిచినప్పుడు ఏమైంది?
X

కేటీఆర్‌, వైఎస్ జగన్‌ భేటీ పై టీడీపీ చేస్తున్న విమర్శలకు వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటుగా సమాధానం ఇచ్చారు. మొన్నటి వరకు చంద్రబాబు… కేసీఆర్‌ చుట్టూ ప్రదక్షణలు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు కేటీఆర్- జగన్ కలిస్తే మాత్రం కుట్ర ఎలా అవుతుందని ప్రశ్నించారు.

కేటీఆర్‌, జగన్ కలిస్తే టీడీపీ నేతలు ఎందుకు ఇంతగా వణికిపోతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ గతంలో దేవినేని ఉమను ఆడనా?.. మగనా? అని ప్రశ్నించారని.. అలాంటి కేసీఆర్‌ విజయవాడకు వస్తే ఎదురెళ్లి అడుగులకు మడుగులొత్తి దుర్గమ్మ దర్శనం చేయించిన దేవినేని ఉమా ఇప్పుడు మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు.

కేసీఆర్‌ చెడ్డవాడైతే అమరావతి శంకుస్థాపనకు పిలిపించి… శిలాపలకంపై ఆయన పేరు కూడా ఎందుకు వేయించారని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు అలా కేసీఆర్‌కు రాచమర్యాదలు చేసినప్పుడు దేవినేని ఉమా లాంటి వారు గాడిదలు కాస్తున్నారా అని మండిపడ్డారు.

కేసీఆర్‌ను చంద్రబాబు ఇంటికి పిలిపించుకుని 36 వంటలతో భోజనం పెట్టారని… ఆ సమయంలో ఒకరు కేసీఆర్‌ చేయి కడిగితే మరొకరు మూతి తుడిచారని రోజా ఎద్దేవా చేశారు. ఇప్పుడు కేటీఆర్‌-జగన్‌ కలవగానే ప్రశ్నించే హక్కు టీడీపీకి ఎక్కడుందని ఆమె నిలదీశారు.

పరిటాల సునీత కుమారుడి పెళ్లికి కేసీఆర్‌ను ఆహ్వానించి… చంద్రబాబు, నారా లోకేష్ స్వయంగా స్వాగతం పలకలేదా అని ప్రశ్నించారు. హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకునే టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం కేటీఆర్‌తో ఇదే చంద్రబాబు చర్చలు జరపలేదా అని నిలదీశారు రోజా.

తాము చంద్రబాబులాగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేయడం లేదని… ప్రత్యేక హోదా సాధనకు మద్దతు పెరుగుతుందనే టీఆర్‌ఎస్‌తో చర్చలు జరిపామన్నారు.

First Published:  17 Jan 2019 6:25 AM GMT
Next Story