Telugu Global
NEWS

అపూర్వ క్రికెటర్లు... అపురూప రికార్డులు

50 ఏళ్ల వయసులో సీకె నాయుడు డబుల్ సెంచరీ 40 ఏళ్ల వయసులో రెండు డబుల్ సెంచరీల వాసిం జాఫర్ ప్రతిభకు వయసుతో సంబంధం లేదంటున్న నాటితరం క్రికెటర్లు… క్రికెట్…మూడక్షరాల ఆట మాత్రమే కాదు. మూడుఫార్మాట్ల సయ్యాట. సాంప్రదాయ టెస్ట్ క్రికెట్, ఇన్ స్టంట్ వన్డే క్రికెట్…ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ . ఈ మూడు ఫార్మాట్లలోనూ పాల్గొని సత్తా చాటుకోడానికి.. వయసు ఏమాత్రం అవరోధం కాదని నాటినుంచి నేటితరం వరకూ పలువురు అసాధారణ క్రికెటర్లు చాటుకొంటూనే వస్తున్నారు. […]

అపూర్వ క్రికెటర్లు... అపురూప రికార్డులు
X
  • 50 ఏళ్ల వయసులో సీకె నాయుడు డబుల్ సెంచరీ
  • 40 ఏళ్ల వయసులో రెండు డబుల్ సెంచరీల వాసిం జాఫర్
  • ప్రతిభకు వయసుతో సంబంధం లేదంటున్న నాటితరం క్రికెటర్లు…

క్రికెట్…మూడక్షరాల ఆట మాత్రమే కాదు. మూడుఫార్మాట్ల సయ్యాట. సాంప్రదాయ టెస్ట్ క్రికెట్, ఇన్ స్టంట్ వన్డే క్రికెట్…ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ . ఈ మూడు ఫార్మాట్లలోనూ పాల్గొని సత్తా చాటుకోడానికి.. వయసు ఏమాత్రం అవరోధం కాదని నాటినుంచి నేటితరం వరకూ పలువురు అసాధారణ క్రికెటర్లు చాటుకొంటూనే వస్తున్నారు.

ఒకే ఒక్కడు… మన తెలుగుతేజం సీకె నాయుడు….

క్రికెట్ చరిత్రలో అసాధారణ రికార్డులు నెలకొల్పిన ఘనత…తెలుగుతేజం, భారత క్రికెట్ తొలి కెప్టెన్ కర్నర్ కఠారి కనకయ్య నాయుడుకి మాత్రమే దక్కుతుంది.

మూడు పదుల వయసులోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు నేటితరం క్రికెటర్లు గుడ్ బై చెబుతుంటే….నాటితరానికి చెందిన సీకె నాయుడు 50 సంవత్సరాల 140 రోజుల వయసులో డబుల్ సెంచరీ సాధించి వారేవ్వా అనిపించుకొన్నారు.

1945-46 సీజన్లో సీకె నాయుడు తన చివరి ద్విశతకాన్ని నమోదు చేశారు. క్రికెట్ ఆడాలన్న కోరిక, తీరిక ఉండాలే కాని… వయసు అనేది ఓ మిథ్య మాత్రమేనని సీకె నాయుడు రికార్డులను చూస్తేనే తెలుస్తుంది.

1940-41 సీజన్లో దేవధర్….

సీకె నాయుడుకు ముందే…1940 1940-41 సీజన్లో దేవధర్… 48 ఏళ్ల 306 రోజుల వయసులో ద్విశతకం సాధించి చరిత్ర సృష్టించారు. ఆ తర్వాతే దేవధర్ రికార్డును సీకె నాయుడు 50 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ సాధించడం ద్వారా తెరమరుగు చేశారు.

ఒకే సీజన్లో ఇద్దరు మొనగాళ్లు….

1957-58 సీజన్లో విజయ్ హజారే 43 సంవత్సరాల 20 రోజుల వయసులో డబుల్ సెంచరీ సాధిస్తే…అదే సీజన్లో వినూ మన్కడ్ 40 సంవత్సరాల 272 రోజుల వయసులో డబుల్ సెంచరీ నమోదు చేశారు.

గత తరం మొనగాడు వాసిం జాఫర్….

2017-18 సీజన్లో వాసిం జాఫర్… 40 సంవత్సరాల 26 రోజుల వయసులో ద్విశతకం సాధించాడు. ఆధునిక క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ జాఫర్ మాత్రమే. ఆ తర్వాత…. 2018-19 సీజన్లో సైతం వాసిం జాఫర్ 40 సంవత్సరాల 335 రోజుల వయసులో మరో డబుల్ సెంచరీ సాధించాడు.

జాఫర్ దేశవాళీ ధమాకా…

ముంబై కమ్ టీమిండియా మాజీ ఓపెనర్ వాసిం జాఫర్ …దేశవాళీ రంజీట్రోఫీ క్రికెట్లో తన పరుగుల వేట కొనసాగిస్తున్నాడు. నాలుగు పదుల వయసులోనూ డబుల్ సెంచరీలు సాధించే సత్తా తనలో ఉందని మరోసారి చాటుకొన్నాడు.

గత కొద్దిసీజన్లుగా విదర్భ జట్టులో సభ్యుడిగా ఆడుతున్న జాఫర్ ..2018-19 సీజన్ క్వార్టర్ ఫైనల్లో ఉత్తరాఖండ్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 206 పరుగుల స్కోరు సాధించాడు.

296 బాల్స్ లోనే జాఫర్ డబుల్ సెంచరీ సాధించడం విశేషం. ఆసియా, భారత క్రికెట్ చరిత్రలోనే 40 ఏళ్ల ప్రాయంలో రెండు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు. జాఫర్ రంజీ కెరియర్ లో ఇది 9వ డబుల్ సెంచరీ కావడం మరో రికార్డు.

పరుగులే పరుగులు….

ప్రస్తుత సీజన్లో…జాఫర్ వరుసగా మూడుమ్యాచ్ ల్లో భారీస్కోర్లు సాధించడం ద్వారా…ప్రతిభకు వయసుతో ఏమాత్రం సంబంధం లేదని చాటుకొన్నాడు.

బరోడా పై 153 పరుగులు, గుజరాత్ పై 126, ముంబై పై 178, సౌరాష్ట్ర పై 98 పరుగుల స్కోర్లు నమోదు చేశాడు. రంజీట్రోఫీ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన ఓపెనర్ గా జాఫర్ చరిత్ర సృష్టించాడు.

250 మ్యాచ్ లు…. 56 శతకాలు….

తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 250 రంజీమ్యాచ్ ల్లో…జాఫర్ 56 శతకాలు, 88 హాఫ్ సెంచరీలతో 81వేల 873 పరుగులు సాధించాడు. అంతేకాదు…ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 19వేల పరుగుల మైలురాయిని చేరాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్ వీరులు….

ఇంతకు ముందే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన మొనగాళ్లలో …సునీల్ గవాస్కర్ 25 వేల 834 పరుగులు, సచిన్ టెండుల్కర్ 25 వేల 396, రాహుల్ ద్రావిడ్ 23వేల 794, వీవీఎస్ లక్ష్మణ్ 19 వేల 730 పరుగుల రికార్డుతో ఉన్నారు.

ప్రస్తుతం 40 సంవత్సరాల 335 రోజుల వయసులో తన కెరియర్ లో 9వ ద్విశతకం బాదిన వాసిం జాఫర్ తన సుదీర్ఘ కెరియర్ ను మరెంతకాలం కొనసాగించగలడన్నదే ఇక్కడి అసలు పాయింట్.

First Published:  19 Jan 2019 11:30 PM GMT
Next Story