Telugu Global
Cinema & Entertainment

ఇండో-పాక్ బోర్డర్ లో గోపీచంద్

యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం ఇండో-పాక్ బార్డర్ లో ఉన్నాడు. ఓ సినిమా షూటింగ్ కోసం జైసల్మేర్ వెళ్లాడు ఈ హీరో. తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ ఇవాళ్టి నుంచి ఇండియా-పాకిస్థాన్ బోర్డర్ జైసల్మేర్ లో ప్రారంభమైంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ భారీ ఫైట్ సీక్వెన్స్ తో మొదలవగా, యాక్షన్ డైరెక్టర్ సెల్వన్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరిస్తున్నారు.. ఏకంగా […]

ఇండో-పాక్ బోర్డర్ లో గోపీచంద్
X

యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం ఇండో-పాక్ బార్డర్ లో ఉన్నాడు. ఓ సినిమా షూటింగ్ కోసం జైసల్మేర్ వెళ్లాడు ఈ హీరో. తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ ఇవాళ్టి నుంచి ఇండియా-పాకిస్థాన్ బోర్డర్ జైసల్మేర్ లో ప్రారంభమైంది.

హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ భారీ ఫైట్ సీక్వెన్స్ తో మొదలవగా, యాక్షన్ డైరెక్టర్ సెల్వన్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరిస్తున్నారు.. ఏకంగా 50 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో రాజస్థాన్, న్యూఢిల్లీ వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరపనున్నారు.

ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తుండగా, వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 18 గా అనిల్ సుంకర ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.. వేసవి కానుకగా మే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

First Published:  21 Jan 2019 6:39 AM GMT
Next Story