Telugu Global
Cinema & Entertainment

రెండు వేల మందితో డాన్స్ చేయబోతున్న చిరంజీవి

మెగా స్టార్ గత కొన్ని నెలల నుంచి “సై రా నరసింహ రెడ్డి” సినిమా షూటింగ్ తోనే బిజీగా ఉన్నాడు అని అందరికి తెలిసిన విషయమే. ఉయ్యాలా వాడా నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ పై ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ఒక పాట షూటింగ్ లో బిజీగా ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం […]

రెండు వేల మందితో డాన్స్ చేయబోతున్న చిరంజీవి
X

మెగా స్టార్ గత కొన్ని నెలల నుంచి “సై రా నరసింహ రెడ్డి” సినిమా షూటింగ్ తోనే బిజీగా ఉన్నాడు అని అందరికి తెలిసిన విషయమే. ఉయ్యాలా వాడా నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ పై ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ఒక పాట షూటింగ్ లో బిజీగా ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాటని తెరకేక్కిస్తున్నారట. ఈ పాటలో దాదాపు వెయ్యిమంది డాన్సర్స్, మరో వెయ్యిమంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. ఇందులో చిరుతో పాటు నయనతార, తమన్నా కూడా పాల్గొంటున్నారట.

రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఒక స్పెషల్ సెట్ లో ఈ పాట షూటింగ్ అవుతుంది. దేశభక్తి ప్రధానంగా సాగే ఈ పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తుందట. మొత్తానికి తన తండ్రి కోసం రెండు వేల మంది డాన్సర్స్ ని తెప్పించి ప్రొడ్యూసర్ గా తానేంటో అందరికి చూపిస్తున్నాడు చరణ్.

First Published:  21 Jan 2019 10:13 PM GMT
Next Story