Telugu Global
NEWS

అసెంబ్లీలో కూన దౌర్జన్యం... మేడా కీలక డాక్యుమెంట్లు ధ్వంసం

రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి… లోటస్‌ పాండ్‌లో వైఎస్‌ జగన్‌ను కలవడంపై టీడీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. మధ్యాహ్నమే పార్టీ నుంచి మేడాను చంద్రబాబు సస్పెండ్ చేశారు. మేడా మల్లికార్జున రెడ్డి జగన్‌ను కలిసేందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెలియగానే ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్ అసెంబ్లీకి చేరుకుని హల్‌చల్ చేశారు. మేడా కూడా ప్రభుత్వ విప్‌గా ఉంటూ వచ్చారు. ఈనేపథ్యంలో మరో విప్‌ అయిన కూన రవికుమార్‌… అసెంబ్లీలోని మేడా మల్లికార్జున రెడ్డి చాంబర్‌లోకి ఆయన […]

అసెంబ్లీలో కూన దౌర్జన్యం... మేడా కీలక డాక్యుమెంట్లు ధ్వంసం
X

రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి… లోటస్‌ పాండ్‌లో వైఎస్‌ జగన్‌ను కలవడంపై టీడీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. మధ్యాహ్నమే పార్టీ నుంచి మేడాను చంద్రబాబు సస్పెండ్ చేశారు.

మేడా మల్లికార్జున రెడ్డి జగన్‌ను కలిసేందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెలియగానే ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్ అసెంబ్లీకి చేరుకుని హల్‌చల్ చేశారు. మేడా కూడా ప్రభుత్వ విప్‌గా ఉంటూ వచ్చారు.

ఈనేపథ్యంలో మరో విప్‌ అయిన కూన రవికుమార్‌… అసెంబ్లీలోని మేడా మల్లికార్జున రెడ్డి చాంబర్‌లోకి ఆయన లేని సమయంలో వెళ్లారు. వెళ్లి మేడా చాంబర్‌లో రికార్డులను పరిశీలించారు. పలు కీలక డాక్యుమెంట్లను ధ్వంసం చేశారు కూన.

మేడా విప్‌గా ఉన్న సమయంలో పార్టీ పెద్దల నుంచి ఆప్‌లైన్‌లో వచ్చిన నోట్‌లు ఉన్నాయన్న ఉద్దేశంతోనే కూన సోదాలు చేసి వాటిని ధ్వంసం చేసినట్టు భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను కూడా నాశనం చేసినట్టు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

First Published:  22 Jan 2019 9:19 AM GMT
Next Story