సోదరుడి కోసం మతం మారాడు.... ప్రార్థనలోనే ప్రాణం విడిచాడు
సోదరుడి ఆరోగ్యం బాగుపడాలన్న ఉద్దేశంతో మతం మారినా ఫలితం లేకపోయింది. సోదరుడి కోసం ప్రార్థనలు చేస్తున్న సమయంలోనే యువకుడు ప్రాణాలు విడిచాడు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఈ ఘటన జరిగింది. గాంధీనగర్కు చెందిన మనోజ్, వినయ్లు కవల పిల్లలు. ఇటీవల మనోజ్కు గుండె సంబంధిత ఇబ్బంది తలెత్తింది. రోజూ ఐదు పూటల నమాజ్ చేస్తే జబ్బు నయమవుతుందని చెప్పడంతో మనోజ్ అలాగే చేస్తున్నాడు. సోదరుడి కోసం వినయ్ కూడా రోజూ ప్రార్థనలు చేసే వాడు. ఈ నేపథ్యంలోనే మూడు […]
సోదరుడి ఆరోగ్యం బాగుపడాలన్న ఉద్దేశంతో మతం మారినా ఫలితం లేకపోయింది. సోదరుడి కోసం ప్రార్థనలు చేస్తున్న సమయంలోనే యువకుడు ప్రాణాలు విడిచాడు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఈ ఘటన జరిగింది.
గాంధీనగర్కు చెందిన మనోజ్, వినయ్లు కవల పిల్లలు. ఇటీవల మనోజ్కు గుండె సంబంధిత ఇబ్బంది తలెత్తింది. రోజూ ఐదు పూటల నమాజ్ చేస్తే జబ్బు నయమవుతుందని చెప్పడంతో మనోజ్ అలాగే చేస్తున్నాడు. సోదరుడి కోసం వినయ్ కూడా రోజూ ప్రార్థనలు చేసే వాడు.
ఈ నేపథ్యంలోనే మూడు నెలల క్రితం ఇద్దరు సోదరులు ముస్లిం మతం స్వీకరించారు. రోజూ నమాజ్ కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే నమాజ్ చేస్తుండగా మసీదులోనే వినయ్ నూర్ మహ్మద్ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. గుండెపోటు రావడంతో అక్కడే ప్రాణాలు విడిచారు. మసీదులోనే ప్రాణాలు విడవడంతో ముస్లిం మతాచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.