Telugu Global
CRIME

భార్యకు సరితూగలేకపోతున్నానని హత్య....

భార్య అందంగా ఉందని ఆనందించాల్సింది పోయి అనుమానం పెంచుకున్నాడు ఓ భర్త. చివరకు ఆ అనుమానమే పెనుభూతమై అతడిని హంతకుడిని చేసింది. భార్య అందంగా ఉండడం, తన పర్సనాలిటీ అంతగా లేకపోవడంతో ఆమెను భర్త హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్‌ పరిధిలో జరిగింది. కృష్ణా జిల్లాకు చెందిన నాగరాజు, జవలమ్మలు బంజారాహిల్స్‌ లోని దేవరకొండ బస్తీలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వెంగళరావు పార్కు వద్ద తోపుడుబండిపై కొబ్బరి బోండాలు అమ్ముతూ […]

భార్యకు సరితూగలేకపోతున్నానని హత్య....
X

భార్య అందంగా ఉందని ఆనందించాల్సింది పోయి అనుమానం పెంచుకున్నాడు ఓ భర్త. చివరకు ఆ అనుమానమే పెనుభూతమై అతడిని హంతకుడిని చేసింది. భార్య అందంగా ఉండడం, తన పర్సనాలిటీ అంతగా లేకపోవడంతో ఆమెను భర్త హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్‌ పరిధిలో జరిగింది.

కృష్ణా జిల్లాకు చెందిన నాగరాజు, జవలమ్మలు బంజారాహిల్స్‌ లోని దేవరకొండ బస్తీలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వెంగళరావు పార్కు వద్ద తోపుడుబండిపై కొబ్బరి బోండాలు అమ్ముతూ జీవనం సాగించే వారు. అయితే జవలమ్మ అందంగా ఉండడంతో నాగరాజు తొలి నుంచి అనుమానపడేవాడు. తన భార్య చాలా అందంగా ఉందని, తాను మాత్రం ఆమెకు సరితూగలేకపోతున్నానని బాధపడేవాడు. ఈ విషయాన్ని పలుమార్లు జవలమ్మకే నేరుగా చెప్పాడు.

ఇలా భర్త తనను అనుమానించడంపై పలుమార్లు ఆమె గొడవ పడింది. ఈనేపథ్యంలో జవలమ్మతో మరోసారి గొడవ పడిన నాగరాజు మద్యం మత్తులో ఆమెను విచక్షణరహితంగా కొట్టాడు. తీవ్రగాయాలతో ఆమె ఇంట్లోనే చనిపోయింది. హత్య చేసిన తర్వాత బంధువులకు ఫోన్ చేసిన నాగరాజు… జవలమ్మను హత్య చేశానని… తాను ఎవరికి కనిపించకుండా పారిపోతున్నట్టు చెప్పాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. హంతకుడి కోసం గాలిస్తున్నారు.

First Published:  26 Jan 2019 12:11 AM GMT
Next Story