Telugu Global
NEWS

చంద్రబాబుతో రాధాకృష్ణ, లగడపాటి మంతనాలు

అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కలిశారు. రాత్రి లగడపాటి, రాధాకృష్ణ ఇద్దరూ ఒకే కారులో చంద్రబాబు వద్దకు వచ్చారు. దాదాపు రెండు గంటల పాటు చంద్రబాబుతో వీరు మంతనాలు జరిపారు. సర్వేల లగడపాటి, మీడియా అధినేత రాధాకృష్ణతో చంద్రబాబు ఎన్నికల వ్యూహాలపై చర్చించినట్టు చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి గెలవబోతోందని ప్రచారం చేయడం ద్వారా తటస్త ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్దెత్తున లగడపాటి ప్రయత్నించారు. ఇప్పుడు […]

చంద్రబాబుతో రాధాకృష్ణ, లగడపాటి మంతనాలు
X

అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కలిశారు. రాత్రి లగడపాటి, రాధాకృష్ణ ఇద్దరూ ఒకే కారులో చంద్రబాబు వద్దకు వచ్చారు.

దాదాపు రెండు గంటల పాటు చంద్రబాబుతో వీరు మంతనాలు జరిపారు. సర్వేల లగడపాటి, మీడియా అధినేత రాధాకృష్ణతో చంద్రబాబు ఎన్నికల వ్యూహాలపై చర్చించినట్టు చెబుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి గెలవబోతోందని ప్రచారం చేయడం ద్వారా తటస్త ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్దెత్తున లగడపాటి ప్రయత్నించారు. ఇప్పుడు ఏపీలోనూ అదే చేస్తారేమో చూడాలి.

First Published:  28 Jan 2019 9:42 PM GMT
Next Story