Telugu Global
NEWS

న్యూజిలాండ్ తో రేపే నాలుగో వన్డే

హామిల్టన్ వన్డేలో మూడు మార్పులతో టీమిండియా రోహిత్ శర్మ నాయకత్వంలో బరిలో టీమిండియా గురువారం ఉదయం 7-30 నుంచి మ్యాచ్ ప్రారంభం టీమిండియా-న్యూజిలాండ్ జట్ల పాంచ్ పటాకా వన్డే సిరీస్ షో….మౌంట్ మాంగునీ నుంచి …హామిల్టన్ సెడాన్ పార్క్ కు చేరింది. ఇప్పటికే 3-0తో సిరీస్ ఖాయం చేసుకొన్న టీమిండియా… రేపు జరిగే నాలుగో వన్డేలో సైతం హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. విరాట్ కు రెస్ట్- రోహిత్ కు పగ్గాలు…. విరాట్ కొహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో […]

న్యూజిలాండ్ తో రేపే నాలుగో వన్డే
X
  • హామిల్టన్ వన్డేలో మూడు మార్పులతో టీమిండియా
  • రోహిత్ శర్మ నాయకత్వంలో బరిలో టీమిండియా
  • గురువారం ఉదయం 7-30 నుంచి మ్యాచ్ ప్రారంభం

టీమిండియా-న్యూజిలాండ్ జట్ల పాంచ్ పటాకా వన్డే సిరీస్ షో….మౌంట్ మాంగునీ నుంచి …హామిల్టన్ సెడాన్ పార్క్ కు చేరింది.

ఇప్పటికే 3-0తో సిరీస్ ఖాయం చేసుకొన్న టీమిండియా… రేపు జరిగే నాలుగో వన్డేలో సైతం హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

విరాట్ కు రెస్ట్- రోహిత్ కు పగ్గాలు….

విరాట్ కొహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో …వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ… సారథిగా పగ్గాలు చేపట్టనున్నాడు. అంతేకాదు…తన కెరియర్ లో వన్డే మ్యాచ్ ల డబుల్ సెంచరీకి సిద్ధమయ్యాడు.

గురువారం ఉదయం 7-30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది.

యువఆటగాడు శుభ్ మన్ గిల్, పేసర్ ఖలీల్ అహ్మద్, స్పిన్నర్ రవీంద్ర జడేజా లేదా కేదార్ జాదవ్ లను తుదిజట్టులోకి తీసుకోడం ఖాయంగా కనిపిస్తోంది.

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు సభ్యులు సెడాన్ పార్క్ లో జరిగిన నెట్ ప్రాక్టీస్ లో పాల్గొన్నారు. సెడాన్ పార్క్ పిచ్ పైన 290కి పైగా పరుగులు సాధించినా..చేజింగ్ కు అవకాశాలుండటంతో …హైస్కోరింగ్ మ్యాచ్ గా ముగిసినా ఆశ్చర్యపోనక్కరలేదు.

అప్పుడు కివీస్…. ఇప్పుడు టీమిండియా….

వన్డే క్రికెట్ రెండోర్యాంకర్, రెండుసార్లు ప్రపంచ చాంపియన్ టీమిండియా…న్యూజిలాండ్ గడ్డపై….పదేళ్ల విరామం తర్వాత ద్వైపాక్షిక సిరీస్ గెలుచుకొంది.

పాంచ్ పటాకా సిరీస్ లో భాగంగా నేపియర్, బే ఓవల్ స్టేడియాలు వేదికగా ముగిసిన మొదటి మూడు వన్డేల్లో టీమిండియాకు ఎదురేలేకపోయింది. మూడో ర్యాంకర్ న్యూజిలాండ్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.

ప్రస్తుత సిరీస్ లో టీమిండియా హ్యాట్రిక్ విజయాలతో పైచేయి సాధించినా……1976 నుంచి 2014 వరకూ న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా ఆడిన సిరీస్ ల్లో అంతంత మాత్రం రికార్డే ఉంది. మొత్తం ఏడు సిరీస్ ల్లో టీమిండియా ఒక్క సిరీస్ మాత్రమే సొంతం చేసుకోగలిగింది. ప్రస్తుత సీరీస్ లో 3-0 ఆధిక్యంతో కివీ గడ్డపై రెండో సిరీస్ ను ఖాయం చేసుకొంది.

టీమిండియా 2, న్యూజిలాండ్ 3….

ఐసీసీ వన్డే తాజా ర్యాంకింగ్స్ ప్రకారం …టీమిండియా, న్యూజిలాండ్ జట్లు.. రెండు, మూడు ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. ఈ రెండుజట్ల ప్రస్తుత పాంచ్ పటాకా సిరీస్ …మొదటి మూడు వన్డేలు ముగిసే వరకూ ఉన్న రికార్డులను చూసినా…న్యూజిలాండ్ దే పైచేయిగా కనిపిస్తోంది.

న్యూజిలాండ్ గడ్డపై భారత్ 1976 నుంచి ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతూ వస్తోంది. ప్రస్తుత సిరీస్ మొదటి మూడు వన్డేల వరకూ ఆడిన మొత్తం ఎనిమిది సిరీస్ ల్లో భారత్ రెండుసార్లు మాత్రమే విజేతగా నిలువగలిగింది. 1976 ప్రారంభ సిరీస్ లో 0-2తో పరాజయం పొందిన భారత్ కు…1991 సిరీస్ లో సైతం అదే ఫలితం ఎదురయ్యింది.

1994 లో జరిగిన వన్డే సిరీస్ ను భారత్ 2-2తో సమం చేసి సత్తా చాటుకొంది. అంతేకాదు…1999 సిరీస్ ను సైతం 2-2తో సమం చేయగలిగింది. 2002-03 జరిగిన ఏడు మ్యాచ్ లో సిరీస్ లో భారత్ కు 2-5తో భారీ ఓటమి తప్పలేదు.

ధోనీ కెప్టెన్సీలో తొలిసారిగా సిరీస్….

2009 సిరీస్ లో భారత్ తొలిసారిగా న్యూజిలాండ్ పై 2-1తో విజేతగా నిలిచింది. మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో భారత్ తొలిసారిగా కివీ గడ్డపై ద్వైపాక్షిక సిరీస్ సొంతం చేసుకోగలిగింది.

ఐదేళ్ల క్రితం న్యూజిలాండ్ వేదికగా ముగిసిన ఐదుమ్యాచ్ లో సిరీస్ లో ఓమ్యాచ్ ను టైగా ముగించిన భారత్…మిగిలిన నాలుగువన్డేల్లోనూ పరాజయాలు చవిచూసింది. చివరకు 0-4తో సిరీస్ ను చేజార్చుకొంది.

ఓవరాల్ గా ఈ రెండుజట్ల మథ్య…న్యూజిలాండ్ గడ్డపై జరిగిన 8 సిరీస్ ల్లో కివీటీమ్ నాలుగు సిరీస్ విజయాలు సాధిస్తే…రెండు సిరీస్ లు డ్రాగా ముగిసాయి. మరో రెండు సిరీస్ ల్లో మాత్రమే భారత్ విజేతగా నిలిచింది.

ఈ రెెండుజట్ల మధ్య జరిగిన వన్డే ల్లో సైతం…న్యూజిలాండ్ ఆధిక్యమే కనిపిస్తుంది. న్యూజిలాండ్ తో భారత్ మొత్తం 37 వన్డేల్లో తలపడితే… 13 విజయాలు సాధించి…21 పరాజయాలు చవిచూసింది. ఓ మ్యాచ్ టైగా ముగిగియగా…మరో రెండు వన్డేలు ఫలితం తేలకుండానే రద్దుల పద్దులో చేరాయి.

ప్రస్తుత పాంచ్ పటాకా సిరీస్ లో మాత్రం…విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా ….మొదటి మూడు వన్డేల్లో విజయాలు సాధించడం ద్వారా తనకుతానే సాటిగా నిలిచింది. ప్రత్యర్థి న్యూజిలాండ్ ఏమాత్రం పోటీకాదని చాటుకొంది.

రోహిత్ కెప్టెన్సీకి పరీక్ష….

మొదటి మూడు వన్డేల్లో పాల్గొనడం ద్వారా టీమిండియాకు సిరీస్ విజయం ఖాయం చేసిన కొహ్లీ… ఆఖరి రెండు వన్డేలతో పాటు… తీన్మార్ టీ-20 సిరీస్ కు సైతం, విశ్రాంతి పేరుతో దూరం కానున్నాడు.

మిగిలిన రెండు వన్డేల్లో విజయాలతో పాటు సిరీస్ స్వీప్ సాధించాల్సిన బాధ్యత… ఇక వైస్ కెప్టెన్ కమ్ స్టాప్ గ్యాప్ కెప్టెన్ రోహిత్ శర్మ పైనే ఉంది.

సిరీస్ లోని నాలుగో వన్డే జనవరి 31న హామిల్టన్, ఆఖరి వన్డే ఫిబ్రవరి 3న వెలింగ్టన్ వేదికలుగా జరుగనున్నాయి.

First Published:  30 Jan 2019 7:00 AM GMT
Next Story