Telugu Global
Cinema & Entertainment

ఏడుస్తూ కూర్చునే రకం కాదట

నిధి అగర్వాల్…..తెలుగు లో అక్కినేని నాగ చైతన్య హీరోగా వచ్చిన “సవ్యసాచి” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్ అవుతుందని నిధి అగర్వాల్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఆ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టింది. ఇక ఆ సినిమా తరువాత మళ్ళీ అక్కినేని హీరో అయిన అఖిల్ తో “మిస్టర్ మజ్ను”  సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అయినా తనకి సక్సెస్ ని తెచ్చిపెడుతుందని నిధి […]

ఏడుస్తూ కూర్చునే రకం కాదట
X

నిధి అగర్వాల్…..తెలుగు లో అక్కినేని నాగ చైతన్య హీరోగా వచ్చిన “సవ్యసాచి” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్ అవుతుందని నిధి అగర్వాల్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఆ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టింది.

ఇక ఆ సినిమా తరువాత మళ్ళీ అక్కినేని హీరో అయిన అఖిల్ తో “మిస్టర్ మజ్ను” సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అయినా తనకి సక్సెస్ ని తెచ్చిపెడుతుందని నిధి అగర్వాల్ ఆశించింది. ఇక్కడ కూడా నిధి అగర్వాల్ ఆశ నెరవేరలేదు.

ఇక ఇప్పుడు నిధి అగర్వాల్ ని ఐరన్ లెగ్ అంటూ కామెంట్స్ మొదలు పెట్టారు కొందరు. దీంతో ఈ కామెంట్స్ పై నిధి అగర్వాల్ మాట్లాడుతూ ” సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు కాస్త నిరాశకు గురయ్యా… కానీ, అది ఒకటి రెండు రోజులు మాత్రమే. ఆ తర్వాత నా పనిలో నేను నిమగ్నమైపోయా. ఫెయిల్యూర్ ఎదురైతే ఏడుస్తూ కూర్చునే రకం కాదు నేను. ఎవరైనా నా తప్పుల గురించి ఎత్తి చూపిస్తే… తదుపరి సినిమాతో తానేంటే నిరూపించుకోవాలన్న పట్టుదల పెరుగుతుంది” అని చెప్పింది నిధి అగర్వాల్.

ప్రస్తుతం నిధి అగర్వాల్…. రామ్ హీరోగా వస్తున్న “ఇస్మార్ట్ శంకర్” సినిమాలో నటిస్తుంది.

First Published:  1 Feb 2019 4:25 AM GMT
Next Story