Telugu Global
NEWS

వైసీపీలోకి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే.. అనుచరులతో భేటీ

మరో సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్… టీడీపీకి గుడ్‌బై చెబుతున్నారు. వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. పార్టీ మారడంపై తన సొంతూరు ప్రకాశం జిల్లా పందిళ్లపల్లిలో ఆమంచి కృష్ణమోహన్ తన అనుచరులతో సమావేశం అయ్యారు. వైసీపీలో చేరడంపై తన అభిప్రాయాలను వివరించారు. 2014లో ఇండిపెండెంట్‌గా గెలిచిన ఆమంచి ఆ తర్వాత టీడీపీలో చేరారు. అయితే ఈసారి వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. రేపు ఆయన వైఎస్‌ జగన్‌ను కలుస్తారని […]

వైసీపీలోకి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే.. అనుచరులతో భేటీ
X

మరో సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్… టీడీపీకి గుడ్‌బై చెబుతున్నారు. వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. పార్టీ మారడంపై తన సొంతూరు ప్రకాశం జిల్లా పందిళ్లపల్లిలో ఆమంచి కృష్ణమోహన్ తన అనుచరులతో సమావేశం అయ్యారు. వైసీపీలో చేరడంపై తన అభిప్రాయాలను వివరించారు.

2014లో ఇండిపెండెంట్‌గా గెలిచిన ఆమంచి ఆ తర్వాత టీడీపీలో చేరారు. అయితే ఈసారి వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. రేపు ఆయన వైఎస్‌ జగన్‌ను కలుస్తారని చెబుతున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబంతోనూ మంచి పరిచయాలు ఆమంచికి ఉన్నాయి. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు వైసీపీలో చేరిన నేపథ్యంలో ఆమంచి కూడా అటుగానే అడుగులు వేస్తున్నారు.

కొద్దికాలం నుంచే వైసీపీ నేతలతో ఆమంచి టచ్‌లో ఉన్నారు. వైసీపీ సర్వేల్లోనూ ఆమంచికి మంచి మార్కులు రావడంతో ఆయన్ను పార్టీలోకి రప్పించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. 2014 ఎన్నికల్లో చీరాల నుంచి నవోదయం పేరుతో ఒక పార్టీ పెట్టి ఆమంచి పోటీ చేసి గెలిచారు. టీడీపీ తరపున పోతుల సునీత పోటీ చేశారు.

First Published:  5 Feb 2019 12:41 AM GMT
Next Story