Telugu Global
Cinema & Entertainment

మరోసారి తెలుగు తెరపైకి

మహానటి సినిమా తర్వాత తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది కీర్తిసురేష్. అప్పటికే ఒప్పుకున్న తమిళ సినిమాల కారణంగా ఈ గ్యాప్ తప్పలేదు. ఇప్పుడీ ముద్దుగుమ్మ మరోసారి టాలీవుడ్ పై కన్నేసింది. ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమాలో ఈమెనే మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని పక్కనపెడితే.. ఆల్రెడీ తెలుగులో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాకు కాల్షీట్లు కేటాయించింది కీర్తిసురేష్. ఈ సినిమా ఓపెనింగ్ కూడా ఈమధ్య గ్రాండ్ గా జరిగింది. […]

మరోసారి తెలుగు తెరపైకి
X

మహానటి సినిమా తర్వాత తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది కీర్తిసురేష్. అప్పటికే ఒప్పుకున్న తమిళ సినిమాల కారణంగా ఈ గ్యాప్ తప్పలేదు. ఇప్పుడీ ముద్దుగుమ్మ మరోసారి టాలీవుడ్ పై కన్నేసింది. ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమాలో ఈమెనే మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది.

ఈ విషయాన్ని పక్కనపెడితే.. ఆల్రెడీ తెలుగులో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాకు కాల్షీట్లు కేటాయించింది కీర్తిసురేష్. ఈ సినిమా ఓపెనింగ్ కూడా ఈమధ్య గ్రాండ్ గా జరిగింది. ఈనెల 10 నుంచి ఈ మూవీ సెట్స్ పైకి రాబోతోంది.

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాతో నరేంద్రనాధ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. మూవీ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోనే ఉంటుంది. రెండో షెడ్యూల్ ను కేరళలో ప్లాన్ చేశారు. ఇక అక్కడ్నుంచి మిగతా షూటింగ్ మొత్తం అమెరికాలోనే చేయబోతున్నారు.

కథ ప్రకారం ఇది అమెరికా బ్యాక్ డ్రాప్ మూవీ. అందుకే ఇండియాలో షూట్ పూర్తిచేసి, మొత్తంగా అమెరికాకు షిఫ్ట్ అవ్వబోతున్నారు. సమ్మర్ తర్వాత ఈ సినిమా విడుదలవుతుంది.

First Published:  6 Feb 2019 8:11 AM GMT
Next Story