Telugu Global
National

బీజేపీ మీడియా సమావేశానికి హెల్మెట్లతో విలేకరులు... కారణమిదే..!

మీడియా సమావేశాలంటే ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. మైకులు, కెమేరాలు, పెన్నులు, నోట్ బుక్స్‌తో విలేకరులు వస్తుంటారు. కాని చత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌లో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి అందరూ తలకు హెల్మెట్లు ధరించి వచ్చారు. వారిని చూసి బీజేపీ నేతలు ఆశ్చర్యపోయారు. అసలు విషయం తెలుసుకొని ఏం మాట్లాడలేక పోయారు. విలేకరులు అలా యుద్దానికి వెళ్లినట్లు హెల్మెట్లు ధరించడానికి గత వారం జరిగిన ఘటనే కారణం. ఒక మీడియా సమావేశంలో సుమన్ పాండే అనే […]

బీజేపీ మీడియా సమావేశానికి హెల్మెట్లతో విలేకరులు... కారణమిదే..!
X

మీడియా సమావేశాలంటే ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. మైకులు, కెమేరాలు, పెన్నులు, నోట్ బుక్స్‌తో విలేకరులు వస్తుంటారు. కాని చత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌లో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి అందరూ తలకు హెల్మెట్లు ధరించి వచ్చారు. వారిని చూసి బీజేపీ నేతలు ఆశ్చర్యపోయారు. అసలు విషయం తెలుసుకొని ఏం మాట్లాడలేక పోయారు.

విలేకరులు అలా యుద్దానికి వెళ్లినట్లు హెల్మెట్లు ధరించడానికి గత వారం జరిగిన ఘటనే కారణం. ఒక మీడియా సమావేశంలో సుమన్ పాండే అనే విలేకరిపై బీజేపీ నేతలు దాడి చేశారు. ఈ ఘటనలో అతని తలకు గాయమైంది. మీడియా సమావేశాన్ని చిత్రీకరిస్తుండగా బీజేపీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దాన్ని డిలీట్ చేయమని విలేకరులపై ఒత్తిడి తెచ్చారు. డిలీట్ చేయడానికి ఒప్పుకోకపోవడంతో దాడి చేశారు.

ఈ ఘటనకు నిరసనగానే మేం హెల్మెట్లు పెట్టుకొని వచ్చామని విలేకరులు బీజేపీ నాయకులకు చెప్పారు. ఒక వేళ మళ్లీ దాడి చేసినా మాకు గాయాలు కాకుండ కూడా కాపాడతాయని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విలేకరులు చెప్పారు.

గత వారం జరిగిన ఘటనపై విలేకరులు పోలీసులకు పిర్యాదు చేయగా దాడికి పాల్పడిన బీజేపీ నేతలను అరెస్టు చేశారు.

First Published:  7 Feb 2019 12:41 AM GMT
Next Story