Telugu Global
National

చత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్... 10 మంది మావోయిస్టులు మృతి

చత్తీస్‌గడ్ అటవీ ప్రాంతం మరో సారి రక్తసిక్తమైంది. బీజాపూర్ అటవీ ప్రాంతంలో ఇవాళ భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. అటవీ ప్రాంతంలో ప్రత్యేక రక్షక దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురైనట్లు సమాచారం. ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించగా 10 మంది మృతదేహాలు పడి ఉన్నాయి. ఆ ప్రాంతం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి, ఆయుధాలను భద్రతా […]

చత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్... 10 మంది మావోయిస్టులు మృతి
X
చత్తీస్‌గడ్ అటవీ ప్రాంతం మరో సారి రక్తసిక్తమైంది. బీజాపూర్ అటవీ ప్రాంతంలో ఇవాళ భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
అటవీ ప్రాంతంలో ప్రత్యేక రక్షక దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురైనట్లు సమాచారం. ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించగా 10 మంది మృతదేహాలు పడి ఉన్నాయి.
ఆ ప్రాంతం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి, ఆయుధాలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
First Published:  7 Feb 2019 2:07 AM GMT
Next Story