మోడీకి రాహుల్ ఛాలెంజ్....
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శల ధాటిని పెంచారు. దమ్ముంటే తనతో ఐదు నిమిషాల పాటు జాతీయ భద్రత, రాఫెల్ విమానాల ఒప్పందంపై చర్చలో పాల్గొనాలని సవాలు విసిరారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ప్రతినిధులతో ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ…. మోడీజీ మీకు 56 ఇంచుల ఛాతి ఉందని మాకు తెలుసు. నేను […]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శల ధాటిని పెంచారు. దమ్ముంటే తనతో ఐదు నిమిషాల పాటు జాతీయ భద్రత, రాఫెల్ విమానాల ఒప్పందంపై చర్చలో పాల్గొనాలని సవాలు విసిరారు.
ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ప్రతినిధులతో ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ…. మోడీజీ మీకు 56 ఇంచుల ఛాతి ఉందని మాకు తెలుసు. నేను సవాలు చేస్తున్నాను.. నాతో ముఖాముఖిగా చర్చకు సిద్దం కండి అన్నారు.
బీజేపీ పార్టీ కూడా నరేంద్ర మోడీని చర్చకు పంపాలని.. ఒక వేదిక ఏర్పాటు చేసి అక్కడ మాట్లాడుకుందాం అన్నారు. నాకు తెలుసు.. మోడీ భయస్తుడు.. ఆయన ఒక పిరికిపంద అని రాహుల్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ గత ఏడాది నవంబర్లో కూడా నరేంద్ర మోడీకి ఇలాంటి సవాలే విసిరారు. రఫేల్పై చర్చకు రావాలని కోరారు. కాని మోడీ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఇక రాహుల్ మాట్లాడుతూ.. అధికారంలోనికి రాగానే కనీస ఆదాయం తప్పక కల్పిస్తామని.. దేశంలోని ప్రతీ పేద వారికి నేరుగా లబ్ది చేకూరుస్తామని ఆయన స్పష్టం చేశారు.