Telugu Global
NEWS

క‌మిష‌న్లు త‌ప్ప ఏదైనా సాధించారా చంద్ర‌బాబు

సింగ‌పూర్ వాడికి భూములు ఇచ్చి రాజ‌ధాని రైతుల జీవితాల‌ను కూడా వ్యాపారం చేసి సంపాదించుకుంటున్న వ్య‌క్తి చంద్ర‌బాబు అని మండిప‌డ్డారు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా లక్ష్మీనారాయ‌ణ‌. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా క‌మిష‌న్ల కోసం కాంట్రాక్టులు త‌ప్ప ఏ ఒక్క ప‌నైనా చంద్ర‌బాబు ఈ నాలుగున్న‌రేళ్ల‌లో చేశారా అని ప్ర‌శ్నించారు. ఢిల్లీ దీక్ష కోసం కోటి 12 లక్ష‌ల రూపాయ‌ల ప్ర‌జ‌ల సొమ్మును కేవ‌లం ప్ర‌త్యేక రైళ్ల కోస‌మే ఖర్చు పెట్టార‌న్నారు. పోల‌వ‌రం క‌డుతున్న‌ది కేంద్ర ప్ర‌భుత్వం కాదా అని నిలదీశారు. భోజ‌నానికి […]

క‌మిష‌న్లు త‌ప్ప ఏదైనా సాధించారా చంద్ర‌బాబు
X

సింగ‌పూర్ వాడికి భూములు ఇచ్చి రాజ‌ధాని రైతుల జీవితాల‌ను కూడా వ్యాపారం చేసి సంపాదించుకుంటున్న వ్య‌క్తి చంద్ర‌బాబు అని మండిప‌డ్డారు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా లక్ష్మీనారాయ‌ణ‌. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా
క‌మిష‌న్ల కోసం కాంట్రాక్టులు త‌ప్ప ఏ ఒక్క ప‌నైనా చంద్ర‌బాబు ఈ నాలుగున్న‌రేళ్ల‌లో చేశారా అని ప్ర‌శ్నించారు.

ఢిల్లీ దీక్ష కోసం కోటి 12 లక్ష‌ల రూపాయ‌ల ప్ర‌జ‌ల సొమ్మును కేవ‌లం ప్ర‌త్యేక రైళ్ల కోస‌మే ఖర్చు పెట్టార‌న్నారు. పోల‌వ‌రం క‌డుతున్న‌ది కేంద్ర ప్ర‌భుత్వం కాదా అని నిలదీశారు. భోజ‌నానికి కూడా ఎక్కువ ధ‌ర చెల్లిస్తూ క‌మిష‌న్ల కోసం క‌క్కుర్తిప‌డుతున్న వ్య‌క్తి చంద్ర‌బాబు అన్నారు.

చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అస‌మ‌ర్థ‌త‌, అవినీతి, దుబారా, అరాచ‌కం త‌ప్ప ఏమైనా సాధించారా అని ప్ర‌శ్నించారు.

లోకేష్ ని ఆంబోతులాగా చంద్రబాబు రాష్ట్రం మీదకు వదిలాడని కన్నా విమర్శించారు. ఆ ఆంబోతు దొరికిన చోటల్లా డబ్బులు కుమ్మేస్తోందని అన్నారు. ఈ ఐదేళ్ళలో రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో మేం చూపిస్తాం… అయితే ఈ చంద్రబాబు ఈ ఐదేళ్ళలో ఈ రాష్ట్రానికి తానేం చేశాడో చెప్పగలడా? అని నిలదీశారు.

ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటివరకు 10 లక్షల కోట్లు ఇచ్చామని అది అబద్దమని ఎవరైనా అంటే తనతో చర్చకు రావాలని గట్కరీ ఛాలెంజ్ చేశాడని…. అది అబద్దమైతే ఎందుకు చర్చకు రావడం లేదని కన్నా ప్రశ్నించాడు.

First Published:  11 Feb 2019 12:54 AM GMT
Next Story