Telugu Global
Cinema & Entertainment

వరుణ్ తేజ్ వదిలేశాడు.... రామ్ ఓకే చెప్పాడు

“అప్పట్లో ఒకడుండేవాడు” సినిమాతో డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు సాగర్ చంద్ర. ఆ సినిమా చూసిన తరువాత వరుణ్ తేజ్ ఈ డైరెక్టర్ కి పిలిచి మరి అవకాశం ఇచ్చాడు. 14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ సమయంలోనే ఆగిపోయింది. ఈ సినిమా నుంచి వరుణ్ తేజ్ ఎందుకు తప్పుకున్నాడు అనే విషయాలు ఎవరికీ తెలియదు. కానీ వరుణ్ తేజ్ మాత్రం ఈ […]

వరుణ్ తేజ్ వదిలేశాడు.... రామ్ ఓకే చెప్పాడు
X

“అప్పట్లో ఒకడుండేవాడు” సినిమాతో డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు సాగర్ చంద్ర. ఆ సినిమా చూసిన తరువాత వరుణ్ తేజ్ ఈ డైరెక్టర్ కి పిలిచి మరి అవకాశం ఇచ్చాడు.

14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ సమయంలోనే ఆగిపోయింది. ఈ సినిమా నుంచి వరుణ్ తేజ్ ఎందుకు తప్పుకున్నాడు అనే విషయాలు ఎవరికీ తెలియదు. కానీ వరుణ్ తేజ్ మాత్రం ఈ సినిమా తప్ప…. అన్ని సినిమాలు స్టార్ట్ చేస్తున్నాడు.

ఇక ఇప్పుడు ఈ దర్శకుడు అదే కథతో హీరో రామ్ ని అప్రోచ్ అయ్యాడు. కథ నచ్చిన రామ్ వెంటనే సినిమాకి ఓకే చెప్పాడు. ఈ సినిమాని స్రవంతి మూవీస్ పై స్రవంతి రవి కిషోర్ ప్రొడ్యూస్ చేయనున్నాడు.

ఇదిలా ఉంటే రామ్, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో “ఇస్మార్ట్ శంకర్” లో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా జూన్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తవగానే సాగర్ సినిమా స్టార్ట్ చేస్తాడట రామ్.

First Published:  13 Feb 2019 5:00 AM GMT
Next Story