ఇక మాటలొద్దు... యుద్ధానికి దిగండి- గంభీర్
పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై క్రికెటర్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్కు గుణపాఠం చెప్పాలని వ్యాఖ్యానించారు. దాడిపై ట్వీట్టర్ వేదికగా స్పందించిన గంభీర్… ఇక కబుర్లు చెప్పడం ఆపేయాలన్నారు. పాకిస్థాన్కు యుద్ధ రంగంలోనే బుద్ది చెప్పాలని సూచించాడు. ఇక మాటలు వద్దని… యుద్ధమే ఉగ్రవాద సమస్యకు పరిష్కారం అని వ్యాఖ్యానించాడు. వేర్పాటు వాదులను ఉపేక్షిస్తూ పోతే ఇలాంటి ఘటనలే జరుగుతాయన్నారు. ఇప్పటి వరకు జరిగింది చాలని… ఇకపై వేర్పాటు వాదులు, పాకిస్థాన్తో మాటలు… కేవలం యుద్ధ భూమిలోనే […]
పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై క్రికెటర్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్కు గుణపాఠం చెప్పాలని వ్యాఖ్యానించారు. దాడిపై ట్వీట్టర్ వేదికగా స్పందించిన గంభీర్… ఇక కబుర్లు చెప్పడం ఆపేయాలన్నారు.
పాకిస్థాన్కు యుద్ధ రంగంలోనే బుద్ది చెప్పాలని సూచించాడు. ఇక మాటలు వద్దని… యుద్ధమే ఉగ్రవాద సమస్యకు పరిష్కారం అని వ్యాఖ్యానించాడు. వేర్పాటు వాదులను ఉపేక్షిస్తూ పోతే ఇలాంటి ఘటనలే జరుగుతాయన్నారు.
ఇప్పటి వరకు జరిగింది చాలని… ఇకపై వేర్పాటు వాదులు, పాకిస్థాన్తో మాటలు… కేవలం యుద్ధ భూమిలోనే ఉండాలన్నారు. గదుల్లో సంభాషణలకు స్వస్తి పలకాలని కోరారు.
ఉగ్రదాడిని కెప్టెన్ విరాట్ కోహ్లి తీవ్రంగా ఖండించారు. అమరులైన వారి కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు.
Yes, let’s talk with the separatists. Yes, let’s talk with Pakistan. But this time conversation can’t be on the table, it has to be in a battle ground. Enough is enough. 18 CRPF personnel killed in IED blast on Srinagar-Jammu highway https://t.co/aa0t0idiHY via @economictimes
— Gautam Gambhir (@GautamGambhir) February 14, 2019