వైఎస్ జగన్కు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ చేసిన విజ్ఞప్తికి సీబీఐ కోర్టు సమ్మతించింది. ఈనెల 18 నుంచి వచ్చే నెల 18 మధ్య ఎప్పుడైనా లండన్ వెళ్లేందుకు కోర్టు ఓకే చెప్పింది. కొద్దిరోజుల క్రితమే జగన్ లండన్ వెళ్లేందుకు సిద్దమయ్యారు. అయితే రాజకీయ పరిణామాలతో అప్పుడు టూర్ వాయిదా వేసుకున్నారు. లండన్లో జగన్ కుమార్తె చదువుతున్నారు. పాదయాత్ర కారణంగా చాలా కాలంగా కుమార్తె వద్దకు జగన్ వెళ్లలేకపోయారు. […]
వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ చేసిన విజ్ఞప్తికి సీబీఐ కోర్టు సమ్మతించింది.
ఈనెల 18 నుంచి వచ్చే నెల 18 మధ్య ఎప్పుడైనా లండన్ వెళ్లేందుకు కోర్టు ఓకే చెప్పింది. కొద్దిరోజుల క్రితమే జగన్ లండన్ వెళ్లేందుకు సిద్దమయ్యారు. అయితే రాజకీయ పరిణామాలతో అప్పుడు టూర్ వాయిదా వేసుకున్నారు.
లండన్లో జగన్ కుమార్తె చదువుతున్నారు. పాదయాత్ర కారణంగా చాలా కాలంగా కుమార్తె వద్దకు జగన్ వెళ్లలేకపోయారు. త్వరలో ఎన్నికలు రాబోతుండడంతో ఆలోపే ఒకసారి లండన్ వెళ్లి వచ్చేందుకు జగన్ నిర్ణయించుకున్నారు.