వైసీపీకి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల రాజీనామా
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గానికి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. టీడీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్థన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కావలి సీటును విష్ణువర్థన్ రెడ్డి ఆశించారు. అయితే మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైపే జగన్ మొగ్గు చూపారు. దీంతో విష్ణువర్థన్ రెడ్డి వైసీపీని వీడుతున్నారు. ఆయనతో పాటు వంటేరు వేణుగోపాల్ రెడ్డి […]
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గానికి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. టీడీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్థన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కావలి సీటును విష్ణువర్థన్ రెడ్డి ఆశించారు. అయితే మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైపే జగన్ మొగ్గు చూపారు. దీంతో విష్ణువర్థన్ రెడ్డి వైసీపీని వీడుతున్నారు. ఆయనతో పాటు వంటేరు వేణుగోపాల్ రెడ్డి కూడా వైసీపీని వీడుతున్నట్టు ప్రకటించారు.
పార్టీ వీడకుండా విష్ణువర్థన్ రెడ్డిని బుజ్జగించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. విష్ణువర్థన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గతంలో ఉన్న అల్లూరు నియోజకవర్గం నుంచి విష్ణువర్థన్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వంటేరు వేణుగోపాల్ రెడ్డి కావలి నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటికే టీడీపీ నేతలతో విష్ణువర్థన్ రెడ్డి, వంటేరు వేణుగోపాల్ రెడ్డిలు చర్చలు జరిపారు.