అమర జవాన్ల కుటుంబాలకు కేటీఆర్ భారీ విరాళం
పుల్వామా ఘటనలో అమరులైన జవాన్లకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. జూబ్లిహిల్స్ సీఆర్పీఎఫ్ కార్యాలయంలో జరిగిన సంతాప కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దాడిలో అమరులైన వారి కుటుంబాలకు కేటీఆర్ రూ. 25లక్షలను విరాళంగా ఇచ్చారు. కేటీఆర్ స్నేహితులంతా కలిసి మరో 25 లక్షలు విరాళంగా ఇచ్చారు. 50లక్షల రూపాయల చెక్ను సీఆర్పీఎఫ్ ఐజీ జీహెచ్పీ రాజుకు కేటీఆర్ అందజేశారు. పుల్వామా దాడి తనను ఎంతగానో కలచివేసింది కేటీఆర్ అన్నారు. జవాన్ల సేవలు, త్యాగాల వల్ల దేశంలో […]
పుల్వామా ఘటనలో అమరులైన జవాన్లకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. జూబ్లిహిల్స్ సీఆర్పీఎఫ్ కార్యాలయంలో జరిగిన సంతాప కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
దాడిలో అమరులైన వారి కుటుంబాలకు కేటీఆర్ రూ. 25లక్షలను విరాళంగా ఇచ్చారు. కేటీఆర్ స్నేహితులంతా కలిసి మరో 25 లక్షలు విరాళంగా ఇచ్చారు. 50లక్షల రూపాయల చెక్ను సీఆర్పీఎఫ్ ఐజీ జీహెచ్పీ రాజుకు కేటీఆర్ అందజేశారు. పుల్వామా దాడి తనను ఎంతగానో కలచివేసింది కేటీఆర్ అన్నారు.
జవాన్ల సేవలు, త్యాగాల వల్ల దేశంలో ప్రజలంతా ప్రశాంతంగా ఉంటున్నారని వ్యాఖ్యానించారు. 72 గంటల్లో 10 కోట్ల రూపాయల విరాళాలు సీఆర్పీఎఫ్ వెల్ఫేర్కు వచ్చాయని సీఆర్పీఎఫ్ ఐజీ రాజు చెప్పారు.