చానల్కు కాసు మహేష్ లీగల్ నోటీసులు
గుంటూరు జిల్లా గురజాల వైసీపీ ఇన్చార్జ్ కాసు మహేష్ ఒక తెలుగు టీవీ చానల్కు లీగల్ నోటీసులు పంపారు. తాను వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నానంటూ శనివారం సదరు చానల్ హడావుడి చేసింది. ఇందుకు కాసు మహేష్ తీవ్రంగా స్పందించారు. తనపై తప్పుడు కథనం ప్రసారం చేసినందుకు గాను చానల్కు లీగల్ నోటీసులు పంపించారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల్లో అత్యధికులు నిజాయితీగా పనిచేస్తున్నారని… కానీ ఒకరిద్దరు డబ్బులకు అమ్ముడుపోయి ఇలాంటి తప్పుడు ప్రచారం […]
గుంటూరు జిల్లా గురజాల వైసీపీ ఇన్చార్జ్ కాసు మహేష్ ఒక తెలుగు టీవీ చానల్కు లీగల్ నోటీసులు పంపారు. తాను వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నానంటూ శనివారం సదరు చానల్ హడావుడి చేసింది.
ఇందుకు కాసు మహేష్ తీవ్రంగా స్పందించారు. తనపై తప్పుడు కథనం ప్రసారం చేసినందుకు గాను చానల్కు లీగల్ నోటీసులు పంపించారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్టుల్లో అత్యధికులు నిజాయితీగా పనిచేస్తున్నారని… కానీ ఒకరిద్దరు డబ్బులకు అమ్ముడుపోయి ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాసు మహేష్ మండిపడ్డారు. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. కానీ యరపతినేని దగ్గర డబ్బులు తీసుకుని కొందరు వ్యక్తులు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.పదేపదే తాను ఖండిస్తున్నా సరే ఇలాంటి కథనాలు పనిగట్టుకుని రాస్తున్నారని… అందుకే తాను లీగల్ నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు.