వేర్పాటువాదులకు గట్టి షాక్ ఇచ్చిన కేంద్రం
పుల్వామా దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు మార్గాల్లో ఉగ్రమూకలు, వారికి అండగా ఉంటున్న శక్తులకు చెక్ పెడుతోంది. ఇప్పటికే పాక్ను మోస్ట్ ఫేవర్డ్ నేషన్ జాబితా నుంచి తొలగించడంతో పాటు, పాక్ నుంచి జరిగే దిగుమతులపై పన్నును 200 శాతానికి పెంచింది. తాజాగా జమ్ముకశ్మీర్లో ఉంటూ పరిస్థితులను రెచ్చగొడుతున్న వేర్పాటువాదులకు భారత్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వేర్పాటువాదులకు కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించింది. వేర్పాటువాద నేతలు మిర్వాజ్ ఉమర్ ఫరూక్, షబ్బీర్ షా, హసీన్ ఖురేషి, అబ్దుల్ […]
పుల్వామా దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు మార్గాల్లో ఉగ్రమూకలు, వారికి అండగా ఉంటున్న శక్తులకు చెక్ పెడుతోంది. ఇప్పటికే పాక్ను మోస్ట్ ఫేవర్డ్ నేషన్ జాబితా నుంచి తొలగించడంతో పాటు, పాక్ నుంచి జరిగే దిగుమతులపై పన్నును 200 శాతానికి పెంచింది.
తాజాగా జమ్ముకశ్మీర్లో ఉంటూ పరిస్థితులను రెచ్చగొడుతున్న వేర్పాటువాదులకు భారత్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వేర్పాటువాదులకు కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించింది. వేర్పాటువాద నేతలు మిర్వాజ్ ఉమర్ ఫరూక్, షబ్బీర్ షా, హసీన్ ఖురేషి, అబ్దుల్ ఘనిలకు గన్మెన్లను ఉపసంహరించింది ప్రభుత్వం.
ప్రభుత్వం ఇస్తున్న భద్రతతో తిరుగుతూ తిరిగి భారత భద్రత దళాలపై దాడులు చేస్తున్న వారికే వీరు మద్దతు ఇస్తున్నారని ఆరోపణ. ఈ నేతల వల్లే కశ్మీర్లో అల్లకల్లోల పరిస్థితులు తలెత్తుతున్నాయని భావిస్తున్నారు.