Telugu Global
NEWS

వైసీపీలోకి కాపునాడు జాతీయ అధ్య‌క్షుడు

వైసీపీలోకి వ‌ల‌స‌లు కొన‌సాగుతున్నాయి. కాపునాడు జాతీయ అధ్య‌క్షుడు, వంగ‌వీటి రంగ మిత్ర‌మండ‌లి నేత గాళ్ల సుబ్ర‌మ‌ణ్యం వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిశారు. త్వ‌ర‌లోనే వైసీపీలో చేరుతున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు. ఆయ‌న‌తో పాటు ప‌లువురు కాపు నాయకులు జ‌గ‌న్‌ను క‌లిశారు. కాపుల ప‌ట్ల తాము తొలి నుంచి సానుకూలంగానే ఉన్నామ‌ని అధికారంలోకి రాగానే అండ‌గా ఉంటామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చార‌ని గాళ్ల వివ‌రించారు. విజ‌య‌వాడ‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కాపుల స్థితిగ‌తుల‌పై జ‌గ‌న్‌తో చ‌ర్చించిన‌ట్టు వెల్ల‌డించారు. అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌ను వైసీపీలో చేర‌డ‌మే స‌రైన చ‌ర్యగా ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. […]

వైసీపీలోకి కాపునాడు జాతీయ అధ్య‌క్షుడు
X

వైసీపీలోకి వ‌ల‌స‌లు కొన‌సాగుతున్నాయి. కాపునాడు జాతీయ అధ్య‌క్షుడు, వంగ‌వీటి రంగ మిత్ర‌మండ‌లి నేత గాళ్ల సుబ్ర‌మ‌ణ్యం వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిశారు. త్వ‌ర‌లోనే వైసీపీలో చేరుతున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు. ఆయ‌న‌తో పాటు ప‌లువురు కాపు నాయకులు జ‌గ‌న్‌ను క‌లిశారు.

కాపుల ప‌ట్ల తాము తొలి నుంచి సానుకూలంగానే ఉన్నామ‌ని అధికారంలోకి రాగానే అండ‌గా ఉంటామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చార‌ని గాళ్ల వివ‌రించారు. విజ‌య‌వాడ‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కాపుల స్థితిగ‌తుల‌పై జ‌గ‌న్‌తో చ‌ర్చించిన‌ట్టు వెల్ల‌డించారు. అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌ను వైసీపీలో చేర‌డ‌మే స‌రైన చ‌ర్యగా ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. తాను కూడా త్వ‌ర‌లోనే వైసీపీలో చేరుతున్న‌ట్టు చెప్పారు.

First Published:  17 Feb 2019 8:20 PM GMT
Next Story