Telugu Global
NEWS

వైసీపీలోకి కిల్లి కృపారాణి!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే చాలామంది కీలక నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత పార్టీని వీడేందుకు రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైసీపీ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 11గంటలకు లోటస్ పాండ్ లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ తో ఆమె భేటీ కానున్నారు. […]

వైసీపీలోకి కిల్లి కృపారాణి!
X

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే చాలామంది కీలక నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత పార్టీని వీడేందుకు రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైసీపీ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 11గంటలకు లోటస్ పాండ్ లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ తో ఆమె భేటీ కానున్నారు.

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ భవిష్యత్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కిల్లి కృపారాణి మూడుసార్లు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు.

2004లో ఓడిపోగా….2009 ఎన్నికల్లో విజయం సాధించారు. కేంద్రమంత్రి వర్గంలో ఆమె ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

First Published:  18 Feb 2019 8:24 PM GMT
Next Story