Telugu Global
Cinema & Entertainment

ప్రొడ్యూసరే కాదు.... హీరో కూడా మారిపోయాడు....

ఈ మధ్యనే ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు సంతోష్ జాగర్లమూడి…. ఇప్పుడు మహాభారతంలోని ఏకలవ్యుడి కాన్సెప్ట్ తో ఒక కథను ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చి తెరకెక్కించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడనే ప్రచారం జరిగింది. కానీ షూటింగ్ ఇంకా మొదలవలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా చేతలు మారి ప్రస్తుతం ఏషియన్ సునీల్ చేతిలో పడిందట. ఈ సినిమాలో నాగశౌర్య హీరో అని తెలుస్తోంది. సందీప్ కిషన్ ను మొదట హీరోగా అనుకున్నారు. కానీ […]

ప్రొడ్యూసరే కాదు.... హీరో కూడా మారిపోయాడు....
X

ఈ మధ్యనే ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు సంతోష్ జాగర్లమూడి…. ఇప్పుడు మహాభారతంలోని ఏకలవ్యుడి కాన్సెప్ట్ తో ఒక కథను ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చి తెరకెక్కించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడనే ప్రచారం జరిగింది. కానీ షూటింగ్ ఇంకా మొదలవలేదు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా చేతలు మారి ప్రస్తుతం ఏషియన్ సునీల్ చేతిలో పడిందట. ఈ సినిమాలో నాగశౌర్య హీరో అని తెలుస్తోంది. సందీప్ కిషన్ ను మొదట హీరోగా అనుకున్నారు. కానీ ఈ కథకు నాగశౌర్య అయితే బాగుంటుందని సంతోష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

విలువిద్య నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. నిర్మాత ఎందుకు మారాడు అనే విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.

డిస్ట్రిబ్యూటర్ గా అందరికి తెలిసిన ఏషియన్ సునీల్ నిర్మాతగా మొదటి సినిమా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతుంది. ఆ సినిమా ఇంకా పట్టాలెక్కక ముందే రెండవ సినిమాకి రెడీ అయ్యాడు సునీల్.

First Published:  19 Feb 2019 2:52 AM GMT
Next Story