Telugu Global
NEWS

చింతమనేనీ... నాలుక చీరేస్తా.... జాగ్రత్త

టీడీపీలో ఉన్న కులగజ్జి నేతలకు తగిన బుద్ది చెబుతామన్నారు అమలాపురం ఎంపీ పి. రవీంద్రబాబు. మరోసారి దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక చీరేస్తామని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను హెచ్చరించారు. దళితులంతా కలిసి చింతమనేనికి రాజకీయ సమాధి కట్టేస్తారన్నారు. రాజ్యాంగం రాసింది ఎవరో కూడా తెలియదా… అంబేద్కర్ పెట్టిన భిక్షతో ఎమ్మెల్యే అయి ఇలాంటి కూతలు కూస్తావా అని ప్రశ్నించారు. ఇప్పటికే సభ్యసమాజం మొత్తం చింతమనేని అంతు చూసేందుకు సిద్దంగా ఉందన్నారు. చింతమనేని లాంటి వారు టీడీపీలో చాలా మంది ఉన్నారని… […]

చింతమనేనీ... నాలుక చీరేస్తా.... జాగ్రత్త
X

టీడీపీలో ఉన్న కులగజ్జి నేతలకు తగిన బుద్ది చెబుతామన్నారు అమలాపురం ఎంపీ పి. రవీంద్రబాబు. మరోసారి దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక చీరేస్తామని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను హెచ్చరించారు.

దళితులంతా కలిసి చింతమనేనికి రాజకీయ సమాధి కట్టేస్తారన్నారు. రాజ్యాంగం రాసింది ఎవరో కూడా తెలియదా… అంబేద్కర్ పెట్టిన భిక్షతో ఎమ్మెల్యే అయి ఇలాంటి కూతలు కూస్తావా అని ప్రశ్నించారు. ఇప్పటికే సభ్యసమాజం మొత్తం
చింతమనేని అంతు చూసేందుకు సిద్దంగా ఉందన్నారు.

చింతమనేని లాంటి వారు టీడీపీలో చాలా మంది ఉన్నారని… చింతమనేనికి నోరు ఎక్కువ కాబట్టి బయటకు మాట్లాడుతున్నారని…. కానీ లోలోన కుల క్యాన్సర్‌తో బాధపడుతున్న వారు టీడీపీలో చాలా మంది ఉన్నారన్నారు.

ఉగ్రవాదం కంటే ఈ కులగజ్జి ప్రమాదకరంగా మారిందన్నారు. ఉగ్రవాదులను కాల్చి చంపినట్టుగానే నేతలకు ఉన్న కులగజ్జిని కూడా మట్టుబెట్టాలన్నారు.

మరోసారి దళితుల గురించి మాట్లాడితే చింతమనేనికి మాటలతో చెప్పడం ఉండదన్నారు. చింతమనేనిపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేయని నేపథ్యంలో… జాతీయ ఎస్సీ కమిషన్‌కు దళిత సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు.

First Published:  21 Feb 2019 9:12 AM GMT
Next Story