పేరు పెట్టండి.... బహుమతులు గెల్చుకోండి !
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బుల్లెట్ రైలు ప్రాజెక్టులో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని అనుకుంటోంది. ముంబై-అహ్మదాబాద్ మధ్య నడిచే తొలి బుల్లెట్ రైలుకు పేరు పెట్టడంతో పాటు దాని కోసం ఒక మస్కట్ను రూపొందించాలని ప్రజలను కోరింది. ఈ పోటీలో పాల్గొనదలచిన వాళ్లు www.mygov.in అనే వెబ్ సైట్లో లాగిన్ అయ్యి మార్చి 25 లోగా బుల్లెట్ ట్రైన్ పేరు, మస్కట్ సూచించాలని కోరింది. అన్ని ఎంట్రీలను పరిశీలించి బుల్లెట్ ట్రైన్కు మంచి పేరును, అలాగే […]
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బుల్లెట్ రైలు ప్రాజెక్టులో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని అనుకుంటోంది. ముంబై-అహ్మదాబాద్ మధ్య నడిచే తొలి బుల్లెట్ రైలుకు పేరు పెట్టడంతో పాటు దాని కోసం ఒక మస్కట్ను రూపొందించాలని ప్రజలను కోరింది.
ఈ పోటీలో పాల్గొనదలచిన వాళ్లు www.mygov.in అనే వెబ్ సైట్లో లాగిన్ అయ్యి మార్చి 25 లోగా బుల్లెట్ ట్రైన్ పేరు, మస్కట్ సూచించాలని కోరింది.
అన్ని ఎంట్రీలను పరిశీలించి బుల్లెట్ ట్రైన్కు మంచి పేరును, అలాగే ఆకర్షణీయమైన మస్కట్ను డిజైన్ చేసిన వాళ్లకు నగదు బహుమతితో పాటు సర్టిఫికేట్ కూడా అందజేయనున్నట్లు బుల్లెట్ ట్రైన్ సంస్థ ప్రకటించింది. మీరు సూచించే పేర్లు, మస్కట్ ప్రయాణికులకు అర్థమయ్యేలా ఉండాలని తెలిపింది.
మరెందుకు ఆలస్యం.. మీరూ పోటీలో పాల్గొని బహుమతులు గెలుచుకోండి.