Telugu Global
NEWS

వైసీపీకి రాజీనామా చేసిన సునీల్

గత ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసిన చెలమలశెట్టి సునీల్ వైసీపీకి రాజీనామా చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అమరావతిలో కలిశారు. త్వరలోనే సునీల్‌ టీడీపీలో చేరుతున్నారు. మార్చి మొదటి వారంలో సునీల్‌ టీడీపీలో చేరేందుకు ముహూర్తం సిద్ధం చేసుకున్నారు. చాలా కాలంగానే సునీల్ వైసీపీకి దూరంగా ఉంటున్నారు. జగన్‌ పాదయాత్రలో కూడా చలమల శెట్టి సునీల్ పాల్గొనలేదు. దాంతో అప్పుడే ఆయన పార్టీ వీడుతారన్న విషయం దాదాపు అందరికీ తెలిసిపోయింది. గతంలోనూ ఒకసారి చంద్రబాబును సునీల్ […]

వైసీపీకి రాజీనామా చేసిన సునీల్
X

గత ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసిన చెలమలశెట్టి సునీల్ వైసీపీకి రాజీనామా చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అమరావతిలో కలిశారు. త్వరలోనే సునీల్‌ టీడీపీలో చేరుతున్నారు. మార్చి మొదటి వారంలో సునీల్‌ టీడీపీలో చేరేందుకు ముహూర్తం సిద్ధం చేసుకున్నారు.

చాలా కాలంగానే సునీల్ వైసీపీకి దూరంగా ఉంటున్నారు. జగన్‌ పాదయాత్రలో కూడా చలమల శెట్టి సునీల్ పాల్గొనలేదు. దాంతో అప్పుడే ఆయన పార్టీ వీడుతారన్న విషయం దాదాపు అందరికీ తెలిసిపోయింది. గతంలోనూ ఒకసారి చంద్రబాబును సునీల్ కలిశారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి కాకినాడ సీటును సునీల్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున కాకినాడ ఎంపీగా గెలిచిన తోట నర్సింహం ఈసారి ఎంపీగా పోటీ చేసేందుకు సుముఖంగా లేరు.

ఇటీవల చంద్రబాబును కలిసిన తోట… తాను ఎంపీగా పోటీ చేయబోనని… తన భార్యకు జగ్గంపేట టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరారు. ప్రస్తుతం జగ్గంపేటనుంచి ఫిరాయింపు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

First Published:  23 Feb 2019 8:39 PM GMT
Next Story