Telugu Global
NEWS

చంద్రబాబుకు షాక్ ఇవ్వనున్న జేసీ దివాకర్ రెడ్డి?

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి షాక్ ఇవ్వనున్నాడా? మొన్నటి వరకూ అనంతపురం ఎంపీ టికెట్ ను తన తనయుడికి కావాలని గట్టిగా డిమాండ్ చేసి, ఒప్పించుకున్న జేసీ ఇప్పుడు అనంతపురం ఎంపీ టికెట్ తమకు వద్దు అంటున్నాడా? అనంతపురం ఎంపీ టికెట్ వద్దని అందుకు ప్రతిగా అనంతపురం ఎమ్మెల్యే టికెట్ కానీ.. మరో ఎమ్మెల్యే సీటు టికెట్ కానీ ఇవ్వాలని జేసీ కోరుతున్నారనే ప్రచారం సాగుతోందిప్పుడు. […]

చంద్రబాబుకు షాక్ ఇవ్వనున్న జేసీ దివాకర్ రెడ్డి?
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి షాక్ ఇవ్వనున్నాడా? మొన్నటి వరకూ అనంతపురం ఎంపీ టికెట్ ను తన తనయుడికి కావాలని గట్టిగా డిమాండ్ చేసి, ఒప్పించుకున్న జేసీ ఇప్పుడు అనంతపురం ఎంపీ టికెట్ తమకు వద్దు అంటున్నాడా? అనంతపురం ఎంపీ టికెట్ వద్దని అందుకు ప్రతిగా అనంతపురం ఎమ్మెల్యే టికెట్ కానీ.. మరో ఎమ్మెల్యే సీటు టికెట్ కానీ ఇవ్వాలని జేసీ కోరుతున్నారనే ప్రచారం సాగుతోందిప్పుడు.

అనంతపురం ఎంపీ సీటు నుంచి దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ పోటీ చేస్తారని చాన్నాళ్లుగానే ప్రచారం సాగుతూ వచ్చింది. తను ఇక ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీగా లేనట్టుగా ఆ మధ్య దివాకర్ రెడ్డి ప్రకటించారు కూడా. తన బదులు తన తనయుడు ఎంపీగా పోటీ చేస్తాడని జేసీ ప్రకటించాడు.

ఆ మేరకు చంద్రబాబు నాయుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. భారీగా డబ్బులు ఖర్చు పెట్టుకోగలరు కాబట్టి.. జేసీ కుటుంబానికి బాబు ఆ రకంగా ప్రాధాన్యతను ఇవ్వనున్నారని ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పుడు ఆఖరి నిమిషంలో జేసీ రూటు మారుస్తున్నారట.

అందుకు కారణం ఏమిటి? అంటే.. అనంతపురం ఎంపీ సీటు నుంచి పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదని జేసీ పవన్ చేయించుకున్న సర్వేల్లో తేలిందట. మొత్తం మూడు రకాల సర్వేలు చేయించుకున్నాడట జేసీ దివాకర్ రెడ్డి తనయుడు. ఆ మూడు సర్వేల్లోనూ నెగిటివ్ రిజల్ట్సే వచ్చాయట. అనంతపురం ఎంపీ సీటు నుంచి ఎవరు పోటీ చేసినా తెలుగుదేశం పార్టీ తరఫున నెగ్గే అవకాశాలు లేవని తేలిందట. ఈ నేపథ్యంలో.. పోటీకి నో అంటున్నాడట జేసీ పవన్.

ఇలా ఆఖరి నిమిషంలో ఎంపీ టికెట్ వద్దు.. ఎమ్మెల్యే టికెట్ కావాలని అంటున్న వీరిని చంద్రబాబు ఎలా డీల్ చేయబోతున్నాడో!

First Published:  24 Feb 2019 9:00 AM GMT
Next Story