Telugu Global
Cinema & Entertainment

ఫుల్ టైం నిర్మాతగా మారిన మహేష్

హీరో మహేష్ బాబు ఫుల్ టైమ్ నిర్మాతగా మారాడు. ఇన్నాళ్లూ బ్రహ్మోత్సవం, శ్రీమంతుడు లాంటి సినిమాలకు సహ-నిర్మాతగా మాత్రమే వ్యవహరించిన మహేష్.. ఈసారి తనే సోలో ప్రొడ్యూసర్ గా మారి మేజర్ అనే సినిమా నిర్మించబోతున్నాడు. ఇందులో హీరోగా అడివి శేష్ నటిస్తాడు. గతంలో గూఢచారి సినిమా తీసిన శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తాడు. ఈ సినిమాతో సోనీ ఇండియా పిక్చర్స్ సంస్థ టాలీవుడ్ లోకి ప్రవేశిస్తోంది. మహేష్ నిర్మించే ఈ సినిమాకు ఈ సంస్థ సహ-నిర్మాతగా […]

ఫుల్ టైం నిర్మాతగా మారిన మహేష్
X

హీరో మహేష్ బాబు ఫుల్ టైమ్ నిర్మాతగా మారాడు. ఇన్నాళ్లూ బ్రహ్మోత్సవం, శ్రీమంతుడు లాంటి సినిమాలకు సహ-నిర్మాతగా మాత్రమే వ్యవహరించిన మహేష్.. ఈసారి తనే సోలో ప్రొడ్యూసర్ గా మారి మేజర్ అనే సినిమా నిర్మించబోతున్నాడు. ఇందులో హీరోగా అడివి శేష్ నటిస్తాడు. గతంలో గూఢచారి సినిమా తీసిన శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తాడు.

ఈ సినిమాతో సోనీ ఇండియా పిక్చర్స్ సంస్థ టాలీవుడ్ లోకి ప్రవేశిస్తోంది. మహేష్ నిర్మించే ఈ సినిమాకు ఈ సంస్థ సహ-నిర్మాతగా వ్యవహరించబోతోంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. అంటే ఈ మూవీతో మహేష్ బాబు బాలీవుడ్ లోకి కూడా ఎంటర్ అవుతున్నాడమన్నమాట.

ఇక కథ విషయానికొస్తే.. ముంబయి తాజ్ హోటల్ పై ముష్కరులు దాడి చేసినప్పుడు ప్రాణాలకు తెగించి వందల మంది ప్రజల్ని కాపాడిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథనే సినిమాగా తీయబోతున్నారు. ఈ సమ్మర్ లో షూటింగ్ స్టార్ట్ చేసి, వచ్చే ఏడాది సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా.. స్క్రిప్ట్ వర్క్ లో కూడా పాలుపంచుకున్నాడు హీరో అడివి శేష్.

First Published:  27 Feb 2019 7:02 AM GMT
Next Story