Telugu Global
Cinema & Entertainment

సాయి ధరం తేజ్ కి రష్మికను సెట్ చేసే పనిలో మారుతి

మెగా సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ ప్రస్తుతానికి తన పూర్తి శ్రద్దని “చిత్రలహరి” సినిమా పై పెట్టాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తేజ్ కి పక్కా ఒక హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా తరువాత సాయి ధరం తేజ్ మారుతీ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాని గీత ఆర్ట్స్ […]

సాయి ధరం తేజ్ కి రష్మికను సెట్ చేసే పనిలో మారుతి
X

మెగా సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ ప్రస్తుతానికి తన పూర్తి శ్రద్దని “చిత్రలహరి” సినిమా పై పెట్టాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తేజ్ కి పక్కా ఒక హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు.

కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా తరువాత సాయి ధరం తేజ్ మారుతీ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాని గీత ఆర్ట్స్ పై అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేయడానికి ముందుకి వచ్చాడు.

ప్రస్తుతం మారుతీ ఈ సినిమా తాలూకు కథా చర్చల్లో బిజీగా ఉంటూనే మరో వైపు హీరోయిన్ కోసం కూడా వేటలో ఉన్నాడు. ఇదిలా ఉంటే మారుతి ఈ సినిమా కోసం హీరోయిన్ గా “గీత గోవిందం” బ్యూటీ రష్మిక ని అనుకున్నాడని తెలుస్తోంది.

హీరోయిన్ గా ప్రస్తుతం ఇండస్ట్రీలో దూసుకుపోతున్న రష్మిక అయితే తన సినిమాకి బాగుంటుందని మారుతీ నమ్ముతున్నాడట. అతి త్వరలో ఈ సినిమా పై అధికారిక ప్రకటన రాబోతుంది.

First Published:  27 Feb 2019 1:04 AM GMT
Next Story