Telugu Global
NEWS

ఐటీ దాడుల్లో వెలుగులోకి చంద్రబాబు ఫ్యామిలీ ఆస్తుల పత్రాలు

సంధ్య రియల్టర్స్‌ , సంధ్య హాస్పిటల్‌పై మంగళవారం ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో అనూహ్యంగా చంద్రబాబు కుటుంబసభ్యుల ఆస్తుల లావాదేవీల పత్రాలు బయటపడ్డాయి. నారా బ్రహ్మణి, నారా భువనేశ్వరి పేరున ఉన్న ఆస్తుల లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు బయటపడ్డాయి. దీనిపై ఐటీ అధికారులు కంపెనీకి చెందిన శ్రీధర్‌ను విచారించారు. గడిచిన రెండేళ్లలో సంధ్య రియల్ ఎస్టేట్ కంపెనీ 500 కోట్ల వరకు వ్యాపారం చేసింది. అయితే అమ్మకాల ద్వారా వచ్చిన లాభాలను ఐటీ రిటన్స్‌లో చూపకుండా ఎగ్గొట్టారు. ఈ అంశంపై ఐటీ దాడులు […]

ఐటీ దాడుల్లో వెలుగులోకి చంద్రబాబు ఫ్యామిలీ ఆస్తుల పత్రాలు
X

సంధ్య రియల్టర్స్‌ , సంధ్య హాస్పిటల్‌పై మంగళవారం ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో అనూహ్యంగా చంద్రబాబు కుటుంబసభ్యుల ఆస్తుల లావాదేవీల పత్రాలు బయటపడ్డాయి. నారా బ్రహ్మణి, నారా భువనేశ్వరి పేరున ఉన్న ఆస్తుల
లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు బయటపడ్డాయి. దీనిపై ఐటీ అధికారులు కంపెనీకి చెందిన శ్రీధర్‌ను విచారించారు.

గడిచిన రెండేళ్లలో సంధ్య రియల్ ఎస్టేట్ కంపెనీ 500 కోట్ల వరకు వ్యాపారం చేసింది. అయితే అమ్మకాల ద్వారా వచ్చిన లాభాలను ఐటీ రిటన్స్‌లో చూపకుండా ఎగ్గొట్టారు. ఈ అంశంపై ఐటీ దాడులు చేయగా… పంజాగుట్టలో నారా భువనేశ్వరికి చెందిన ఏడు కోట్ల విలువైన ఆస్తికి సంబంధించిన లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి.

అయితే ఈ అంశంపై టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు స్పందించారు. ఇదంతా బీజేపీ కుట్ర అని ఆరోపించారు. ఐటీ దాడుల్లో దొరికిన పత్రాలు వాస్తవమేనని… అవన్నీ చట్టబద్దంగా జరిగిన లావాదేవీలేనని స్పష్టం చేశారు.

అయినా ఆస్తుల అమ్మకం, కొనుగోలు చేయడం ఏమైనా నేరమా అని ప్రశ్నించారు. పంజాగుట్ట ఆస్తికి సంబంధించి బయటపడ్డ పత్రాలన్నీ అసలైనవేనని… అవన్నీ చట్టబద్దమైనవేనన్నారు.

First Published:  27 Feb 2019 11:22 PM GMT
Next Story