Telugu Global
NEWS

చంద్రబాబు, కోట్లపై బైరెడ్డి ఫైర్

ఎన్నికలు సమీపిస్తుండడంతో రాయలసీమ ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు మరోసారి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. మార్చి రెండున కర్నూలు జిల్లాలో గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులకు చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని చెప్పడంపై బైరెడ్డి మండిపడ్డారు. పక్క రాష్ట్రాలతో ముడిపడి ఉన్న ఈ ప్రాజెక్టులకు చంద్రబాబు హడావుడిగా ఎలా శంకుస్థాపన చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబుకు నిజంగా ప్రాజెక్టులపై చిత్తశుద్ది ఉంటే కర్నాటక, తెలంగాణ ప్రభుత్వాలతో చర్చలు జరపాల్సిందన్నారు. కనీసం అధికారుల ద్వారానైనా పక్క రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందన్నారు. అలాంటిదేమీ చేయకుండా హఠాత్తుగా శంకుస్థాపన […]

చంద్రబాబు, కోట్లపై బైరెడ్డి ఫైర్
X

ఎన్నికలు సమీపిస్తుండడంతో రాయలసీమ ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు మరోసారి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. మార్చి రెండున కర్నూలు జిల్లాలో గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులకు చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని చెప్పడంపై బైరెడ్డి మండిపడ్డారు.

పక్క రాష్ట్రాలతో ముడిపడి ఉన్న ఈ ప్రాజెక్టులకు చంద్రబాబు హడావుడిగా ఎలా శంకుస్థాపన చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబుకు నిజంగా ప్రాజెక్టులపై చిత్తశుద్ది ఉంటే కర్నాటక, తెలంగాణ ప్రభుత్వాలతో చర్చలు జరపాల్సిందన్నారు. కనీసం అధికారుల ద్వారానైనా పక్క రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందన్నారు. అలాంటిదేమీ చేయకుండా హఠాత్తుగా శంకుస్థాపన చేయడం అంటే ఇది ముమ్మాటికి ప్రజలను మోసం చేయడమేనన్నారు బైరెడ్డి.

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరడం చూస్తుంటే నవ్వొస్తోందన్నారు. ఇప్పటి వరకు గుర్తుకు రాని ఈ ప్రాజెక్టులు సూర్యప్రకాశ్‌ రెడ్డికి ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చాయో అర్థం కావడం లేదన్నారు. కేవలం ఎన్నికల సందర్భంగా జిల్లా ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకునేందుకు చంద్రబాబు, కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డిలు కలిసి ఈ నాటకం మొదలుపెట్టారని బైరెడ్డి విమర్శించారు. కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి టీడీపీలోకి వెళ్తున్నా ఆయన వెంట అనుచరులు కూడా వెళ్లడం లేదన్నారు.

First Published:  28 Feb 2019 8:47 PM GMT
Next Story