Telugu Global
NEWS

డీఎల్‌ రివర్స్‌... బాబుపై సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం కడప జిల్లా ఖాజీపేటలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన డీఎల్ రవీంద్రారెడ్డి… ఏపీలో టీడీపీని భూస్థాపితం చేయాలని పిలునిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నారు.  రాష్ట్రంలో టీడీపీని భూస్థాపితం చేయడమే తన లక్ష్యమని ప్రకటించారు. 2014ఎన్నికల్లో మైదుకూరులో టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌ తరపున డీఎల్ పనిచేశారు. కానీ ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో పుట్టా సుధాకర్ యాదవ్‌ పదేపదే డీఎల్‌కు […]

డీఎల్‌ రివర్స్‌... బాబుపై సంచలన వ్యాఖ్యలు
X

మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం కడప జిల్లా ఖాజీపేటలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన డీఎల్ రవీంద్రారెడ్డి… ఏపీలో టీడీపీని భూస్థాపితం చేయాలని పిలునిచ్చారు.

చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నారు. రాష్ట్రంలో టీడీపీని భూస్థాపితం చేయడమే తన లక్ష్యమని ప్రకటించారు. 2014ఎన్నికల్లో మైదుకూరులో టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌ తరపున డీఎల్ పనిచేశారు. కానీ ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో పుట్టా సుధాకర్ యాదవ్‌ పదేపదే డీఎల్‌కు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు.

పుట్టాకు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినందున వచ్చే ఎన్నికల్లో మైదుకూరు టికెట్ డీఎల్‌కే అంటూ చంద్రబాబు సంకేతాలు ఇస్తూ వచ్చారు. కేవలం తనను ఎటూ కాకుండా చేసేందుకే చంద్రబాబు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుసుకున్న డీఎల్.. కార్యకర్తల సమావేశంలో టీడీపీని భూస్థాపితం చేయాలంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో డీఎల్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందని అనుచరులు చెబుతున్నారు.

First Published:  4 March 2019 10:39 AM GMT
Next Story