Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్ సినిమాలో కీర్తి సురేష్.... దేవి శ్రీ ప్రసాద్ సంగీతం

“నేను లోకల్” సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఆ తరువాత సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన “మహానటి” సినిమాలో నటించి ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్ లో కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకి ప్రేక్షకులు అందరూ ఫిదా అయిపోయారు. ఇక కీర్తి సురేష్ ఆ తరువాత నటించిన “సామి 2” “పందెం కోడి 2” ఇవేవి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. […]

బాలీవుడ్ సినిమాలో కీర్తి సురేష్.... దేవి శ్రీ ప్రసాద్ సంగీతం
X

“నేను లోకల్” సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఆ తరువాత సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన “మహానటి” సినిమాలో నటించి ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్ లో కూడా మంచి పేరు తెచ్చుకుంది.

ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకి ప్రేక్షకులు అందరూ ఫిదా అయిపోయారు. ఇక కీర్తి సురేష్ ఆ తరువాత నటించిన “సామి 2” “పందెం కోడి 2” ఇవేవి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ భామకి ఒక బాలీవుడ్ ఆఫర్ తగిలింది. అవును బాలీవుడ్ దర్శకుడు నగేష్ కుక్కునూర్ దర్శకత్వంలో ఒక పెద్ద ప్రాజెక్టుకు సైన్ చేసింది కీర్తి సురేష్. ఇది ఒక లేడీ ఓరియంటెడ్ చిత్రం అని తెలుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ కథ అయినా కూడా ఈ సినిమాలో కమర్షియల్ హంగులు చాలా ఉంటాయట.

అయితే ఈ సినిమా కోసం టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ని తీసుకున్నారట మూవీ యూనిట్. ఇప్పటికే కీర్తి సురేష్ తెలుగులో హీరోయిన్ గా నటించిన ‘నేను లోకల్’ మరియు ‘నేను శైలజ’ సినిమాలకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ బాలీవుడ్ సినిమా కోసం మళ్ళీ కీర్తి సురేష్ సినిమాకి సంగీతం అందించబోతున్నాడు దేవి. తెలుగు, తమిళ బాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది.

First Published:  6 March 2019 11:59 PM GMT
Next Story